Gautam Adani: పెరిగిన అదానీ గ్రాఫ్.. పడిపోయిన ముఖేష్ అంబానీ స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ పెను సంచలనం చోటుచేసుకుంది. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత.. టాప్-5లో ఉన్న గౌతమ్ అదానీ స్థానం టాప్-30కి పడిపోయింది. అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన తీవ్రమైన ఆరోపణల నుంచి ఇటీవలే గౌతమ్ అదానీ గ్రూప్ తేరుకుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించేందుకు గౌతమ్ అదానీ అనేక అప్పులను గడువు కంటే చాలా ముందరే చెల్లించారు. ఆ తర్వాత వారిపై ఒత్తిడి తగ్గడంతో వారి గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్ల బలమైన పనితీరుతో అదానీ ఈ జాబితాలోకి దూసుకెళ్లారు. ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో వెనుకబడ్డారు. మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ అతడిని ఢీకొట్టాడు. ఈ జాబితాలో జుకర్బర్గ్ 12వ స్థానం నుంచి 10వ స్థానానికి ఎగబాకాడు.
టాప్ 20లో గౌతమ్ అదానీ
బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో అంతకుముందు అదానీ వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు టాప్ 20లో చేరారు. అదానీ గ్రూప్ యజమాని నికర విలువ 62.9 బిలియన్ డాలర్లు. సంపన్నుల జాబితాలో 18వ స్థానానికి ఎగబాకాడు. గత 24 గంటల్లో అదానీ సంపద 438 మిలియన్ డాలర్లు పెరిగింది. గౌతమ్ అదానీ ఇప్పుడు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్లో 24వ స్థానంలో ఉన్నారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Read Also:Bengaluru Rains: బెంగళూర్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం.. ఎల్లో అలర్ట్ జారీ..
గౌతమ్ అదానీ సంపద పెరుగుదల
గత కొద్ది రోజులుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. అదానీ విల్మార్, పవర్ అండ్ ట్రాన్స్మిషన్ షేర్లు బలంగా పుంజుకున్నాయి. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ గణనీయంగా పెరిగింది. దీంతో గౌతం అదానీ సంపద పెరిగింది.
12 లక్షల కోట్లు కొట్టేసింది
అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్పై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సంస్థ నివేదిక తర్వాత భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ ఖండించింది. కానీ ఇప్పటికీ గ్రూప్లోని అన్ని షేర్లు పతనమైన సెషన్ను ప్రారంభించాయి. ఈ పరిణామాలన్నింటిలో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 12 లక్షల కోట్లు పడిపోయింది.
Read Also:New SP office: వనపర్తిలో కొత్త ఎస్పీ ఆఫీస్ ను ప్రారంభించిన హోంశాఖ మంత్రి
ఉపశమనం కల్పించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ నివేదిక తర్వాత అదానీ గ్రూపునకు ఊరట లభించింది. గ్రూపులోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు దూసుకుపోతున్నాయి. బుల్లిష్ సెషన్ సోమవారం, నేడు మంగళవారం కూడా కొనసాగింది. అయితే నిన్న ఈ స్టాక్ 19 శాతం పెరిగింది. అదానీ గ్రూప్ షేరు ధరలో ఎలాంటి అవాంతరాలు లేవని సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ నివేదిక ఇచ్చింది. ఇందుకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. సెబీ విచారణలో కూడా ఏమీ దొరకలేదని తేలింది.
ముఖేష్ అంబానీ సంపద ఎంత?
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. అతని మొత్తం సంపద 93.1 బిలియన్ డాలర్లు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ సంపద 86.1 బిలియన్ డాలర్లు. ఈ జాబితాలో మార్క్ జుకర్బర్గ్ 10వ స్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ జాబితాలో అతను 12వ స్థానంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?