TTD Chairman: తిరుమలలో సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇవాళ ఉదయం 11.44 గంటలకు గరుడాళ్వార్ సన్నిధిలో టీడీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు సీఎం జగన్ కు భూమన కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
తిరుమల తిరుపతి దేవస్థాన కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు ఇచ్చినందుకు భక్తులకు అండగా ఉంటానని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ధనవంతులుకు ఉడిగం చెయ్యడానికో.. వారికి ప్రాధాన్యత ఇవ్వడానికో ఈ పదవి చెప్పట్ట లేదు అని ఆయన వ్యాఖ్యనించారు. హింధు ధార్మికతను పెంపోందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేవుడిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడం కాదు.. స్వామివారు భక్తుడిని అనుగ్రహించే క్షణకాల దర్శనం లభిస్తే చాలు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: Purandeshwari: పంచాయతీల్లో నిధులు లేక సర్పంచ్ లు ఆత్మహత్యలు
టీటీడీ చైర్మన్ గా పెద్దలకు విజ్ఞప్తి చేస్తూన్నాను.. ఎక్కువ సమయం స్వామివారిని దర్శించుకోవాలన్నా కోరిక సమంజసం కాదు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కోట్లాది మంది ఆశించే టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తూ ఉంటే.. సామాన్య భక్తుడినైన నన్ను స్వామివారు అనుగ్రహించారు అని ఆయన వెల్లడించారు. గతంలో నాలుగు సంవత్సరాలు పాలకమండలి సభ్యుడిగా వున్నా.. నాలుగు సార్లు కూడా వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్లలేదు.. సామాన్య భక్తుడిలాగే స్వామివారిని మహలఘు విధానంలో అనేక సార్లు దర్శించుకున్నాను అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
Read Also: 7/G Brundavan Colony : రీ రిలీజ్ కు సిద్దమైన కల్ట్ క్లాసిక్ మూవీ..?
సామాన్య భక్తులకు దర్శనం చెయ్యించడమే కాదు.. భక్తులు దగ్గరకే ఆధ్యాత్మిక కార్యక్రమాలను తీసుకువెళ్తామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చిన్న సమస్య కూడా లేకూండా రోజుకి 85 వేల మంది భక్తులకు దర్శనం చేయిస్తున్న.. ఆలయం తిరుమలే అని అన్నారు. నేను దర్శనాలు చేసుకోవడానికి.. దర్శనాలు చెయ్యించడానికి అయిన అధ్యక్షుడిని కాదు.. సామాన్య భక్తులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!