TTD Chairman: తిరుమలలో సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇవాళ ఉదయం 11.44 గంటలకు గరుడాళ్వార్ సన్నిధిలో టీడీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు సీఎం జగన్ కు భూమన కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
తిరుమల తిరుపతి దేవస్థాన కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు ఇచ్చినందుకు భక్తులకు అండగా ఉంటానని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ధనవంతులుకు ఉడిగం చెయ్యడానికో.. వారికి ప్రాధాన్యత ఇవ్వడానికో ఈ పదవి చెప్పట్ట లేదు అని ఆయన వ్యాఖ్యనించారు. హింధు ధార్మికతను పెంపోందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేవుడిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడం కాదు.. స్వామివారు భక్తుడిని అనుగ్రహించే క్షణకాల దర్శనం లభిస్తే చాలు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: Purandeshwari: పంచాయతీల్లో నిధులు లేక సర్పంచ్ లు ఆత్మహత్యలు
టీటీడీ చైర్మన్ గా పెద్దలకు విజ్ఞప్తి చేస్తూన్నాను.. ఎక్కువ సమయం స్వామివారిని దర్శించుకోవాలన్నా కోరిక సమంజసం కాదు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కోట్లాది మంది ఆశించే టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తూ ఉంటే.. సామాన్య భక్తుడినైన నన్ను స్వామివారు అనుగ్రహించారు అని ఆయన వెల్లడించారు. గతంలో నాలుగు సంవత్సరాలు పాలకమండలి సభ్యుడిగా వున్నా.. నాలుగు సార్లు కూడా వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్లలేదు.. సామాన్య భక్తుడిలాగే స్వామివారిని మహలఘు విధానంలో అనేక సార్లు దర్శించుకున్నాను అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
Read Also: 7/G Brundavan Colony : రీ రిలీజ్ కు సిద్దమైన కల్ట్ క్లాసిక్ మూవీ..?
సామాన్య భక్తులకు దర్శనం చెయ్యించడమే కాదు.. భక్తులు దగ్గరకే ఆధ్యాత్మిక కార్యక్రమాలను తీసుకువెళ్తామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చిన్న సమస్య కూడా లేకూండా రోజుకి 85 వేల మంది భక్తులకు దర్శనం చేయిస్తున్న.. ఆలయం తిరుమలే అని అన్నారు. నేను దర్శనాలు చేసుకోవడానికి.. దర్శనాలు చెయ్యించడానికి అయిన అధ్యక్షుడిని కాదు.. సామాన్య భక్తులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!