Bhatti Vikramarka : ప్రస్తుత రాజకీయం అంతా నవ్వులాట లెక్క మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల గుత్తి కోయల దాడిలో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మంలో ఫారెస్ట్ అధికారి బలి కావడం బాధాకరమన్నారు. సమస్య పరిష్కారం ఆలస్యం చేస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తాం అని చెప్పి ఇవ్వకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. భూమిపై హక్కు కోల్పోయాం అనే బాధతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, గత ప్రభుత్వంలో ల్యాండ్ అసైన్డ్ కమిటీ లు ఉండేవన్నారు. కానీ.. కేసీఆర్ వచ్చాక ఒక్క కమిటీ లేదు..కమిటీ మీటింగులే లేవని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది తెలంగాణలో అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Guntur Mayor ManoharNaidu: గుంటూరు అభివృద్ధిపై చర్చకు రెడీ
అంతేకాకుండా.. ‘ప్రజల సమస్యలు చర్చకు రాకుండా బీజేపీ.. టీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహారం చేస్తున్నాయి. సమస్యల నుండి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఈడీ ఒకరి మీద… ఏసీబీ ఇంకొకరి మీద దాడులు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు.. ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పక్కన పెట్టి తమ సమస్యల మీదనే దృష్టి పెట్టాయి. ప్రస్తుత రాజకీయం అంతా నవ్వులాట లెక్క మారింది. సంస్థలు.. వ్యవస్థలు అన్నీ టిని ఇతరుల మీద దాడికి ఉప యోగిస్తున్నారు. పోడు భూముల పై మంత్రుల కమిటీ కూడా చట్ట ప్రకారం పని చేయడం లేదు. గతంలో ఎప్పుడూ ఐటీ దాడులు జరగలేదా..? పార్టీలు ఇదే అంశాన్ని రాజకీయ పార్టీలు భూతద్దం లో పెట్టి చూపిస్తున్నాయు.
Also Read : Vijaysai Reddy On Bonda Uma: బోండా ఉమాపై విజయసాయి ట్వీట్ వార్
Also Read
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
రెగ్యులర్ గా జరిగే దాడులే. ఐటీ.. ఈడీ దాడులు విధి నిర్వహణలో జరిగేవే. రాజకీయ కక్షతో చేస్తున్నట్టు రాజకీయ పార్టీలు చిత్రీకరిస్తున్నారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ విడకుండా ఉండాల్సింది. కానీ ఆయన చెప్పిన కారణాలు సరికాదు. బీజేపీ దేశానికి ప్రమాదం. మర్రి చెన్నారెడ్డి లౌకిక వాది. చెన్నారెడ్డి కొడుకుగా ఆయన నిర్ణయం సరికాదు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయలని కుట్ర చేస్తున్న పార్టీల వ్యూహం లో భాగంగా ఆరోపణలు చేయిస్తున్నారు. జగ్గారెడ్డి మాటలు విన్నాను. మేము వైఫల్యం చెందాము అనే భావనలోకి ఆయన వచ్చి అలా అని ఉంటారు. నాతో ఎక్కడ ఏం చేయాలో చెప్తే అది చేసేవాణ్ణి. పార్టీకి క్యాన్సర్ వచ్చింది అనే మాటను ఖండిస్తున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్లో
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!