Mobile Phone Ban: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం!.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
- 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం
- విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం
- విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. వీటి వాడకంతో ఆరోగ్య సమస్యలతో పాటు చదువులో రాణించలేకపోతున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొబైల్, సోషల్ మీడియా పిల్లలకు, మైనర్ విద్యార్థులకు వాడకుండా నిషేధం విధించాలని డిమాండ్స్ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు కర్ణాటకలో. కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే ప్రణాళికను పరిశీలిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల అభిప్రాయాన్ని కోరారు.
Also Read:Zodiac Signs Luck After Holi: హోలీ తర్వాత ఈ రాశుల వారికి డబ్బులే డబ్బులు..
Also Read
విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం పెరుగుతున్నందున, ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల ఉదాహరణలను ఉటంకిస్తూ, విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ లేని మొబైల్ ఫోన్ వాడకం విద్యార్థుల విద్య, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి, మైనర్ విద్యార్థులకు క్యాంపస్లో మొబైల్ ఫోన్లను నిషేధించడాన్ని పరిశీలిస్తోంది.
Also Read:Terror Attack Plan: తమిళనాడులో ఉగ్ర కుట్ర భగ్నం.. ఆరుగురు అరెస్ట్
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆస్ట్రేలియాతో సహా అనేక ఇతర దేశాలు ఇప్పటికే విద్యార్థులకు మొబైల్ ఫోన్లను నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నాయని అన్నారు. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం కూడా మైనర్ విద్యార్థులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైస్ ఛాన్సలర్కు విద్యా రంగం గురించి లోతైన అవగాహన ఉన్నందున, ఈ విధానాన్ని అమలు చేయడంలో ఆయన అభిప్రాయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?