Mobile Phone Ban: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం!.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
- 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం
- విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం
- విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. వీటి వాడకంతో ఆరోగ్య సమస్యలతో పాటు చదువులో రాణించలేకపోతున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొబైల్, సోషల్ మీడియా పిల్లలకు, మైనర్ విద్యార్థులకు వాడకుండా నిషేధం విధించాలని డిమాండ్స్ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు కర్ణాటకలో. కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే ప్రణాళికను పరిశీలిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల అభిప్రాయాన్ని కోరారు.
Also Read:Zodiac Signs Luck After Holi: హోలీ తర్వాత ఈ రాశుల వారికి డబ్బులే డబ్బులు..
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం పెరుగుతున్నందున, ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల ఉదాహరణలను ఉటంకిస్తూ, విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ లేని మొబైల్ ఫోన్ వాడకం విద్యార్థుల విద్య, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి, మైనర్ విద్యార్థులకు క్యాంపస్లో మొబైల్ ఫోన్లను నిషేధించడాన్ని పరిశీలిస్తోంది.
Also Read:Terror Attack Plan: తమిళనాడులో ఉగ్ర కుట్ర భగ్నం.. ఆరుగురు అరెస్ట్
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆస్ట్రేలియాతో సహా అనేక ఇతర దేశాలు ఇప్పటికే విద్యార్థులకు మొబైల్ ఫోన్లను నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నాయని అన్నారు. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం కూడా మైనర్ విద్యార్థులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైస్ ఛాన్సలర్కు విద్యా రంగం గురించి లోతైన అవగాహన ఉన్నందున, ఈ విధానాన్ని అమలు చేయడంలో ఆయన అభిప్రాయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!