Mobile Phone Ban: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం!.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
- 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం
- విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం
- విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన
స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. వీటి వాడకంతో ఆరోగ్య సమస్యలతో పాటు చదువులో రాణించలేకపోతున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొబైల్, సోషల్ మీడియా పిల్లలకు, మైనర్ విద్యార్థులకు వాడకుండా నిషేధం విధించాలని డిమాండ్స్ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు కర్ణాటకలో. కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే ప్రణాళికను పరిశీలిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల అభిప్రాయాన్ని కోరారు.
Also Read:Zodiac Signs Luck After Holi: హోలీ తర్వాత ఈ రాశుల వారికి డబ్బులే డబ్బులు..
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం పెరుగుతున్నందున, ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల ఉదాహరణలను ఉటంకిస్తూ, విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ లేని మొబైల్ ఫోన్ వాడకం విద్యార్థుల విద్య, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి, మైనర్ విద్యార్థులకు క్యాంపస్లో మొబైల్ ఫోన్లను నిషేధించడాన్ని పరిశీలిస్తోంది.
Also Read:Terror Attack Plan: తమిళనాడులో ఉగ్ర కుట్ర భగ్నం.. ఆరుగురు అరెస్ట్
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆస్ట్రేలియాతో సహా అనేక ఇతర దేశాలు ఇప్పటికే విద్యార్థులకు మొబైల్ ఫోన్లను నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నాయని అన్నారు. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం కూడా మైనర్ విద్యార్థులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైస్ ఛాన్సలర్కు విద్యా రంగం గురించి లోతైన అవగాహన ఉన్నందున, ఈ విధానాన్ని అమలు చేయడంలో ఆయన అభిప్రాయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
-
Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?