Mobile Phone Ban: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం!.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
- 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం
- విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం
- విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. వీటి వాడకంతో ఆరోగ్య సమస్యలతో పాటు చదువులో రాణించలేకపోతున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొబైల్, సోషల్ మీడియా పిల్లలకు, మైనర్ విద్యార్థులకు వాడకుండా నిషేధం విధించాలని డిమాండ్స్ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు కర్ణాటకలో. కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే ప్రణాళికను పరిశీలిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల అభిప్రాయాన్ని కోరారు.
Also Read:Zodiac Signs Luck After Holi: హోలీ తర్వాత ఈ రాశుల వారికి డబ్బులే డబ్బులు..
Also Read
విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం పెరుగుతున్నందున, ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల ఉదాహరణలను ఉటంకిస్తూ, విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ లేని మొబైల్ ఫోన్ వాడకం విద్యార్థుల విద్య, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి, మైనర్ విద్యార్థులకు క్యాంపస్లో మొబైల్ ఫోన్లను నిషేధించడాన్ని పరిశీలిస్తోంది.
Also Read:Terror Attack Plan: తమిళనాడులో ఉగ్ర కుట్ర భగ్నం.. ఆరుగురు అరెస్ట్
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆస్ట్రేలియాతో సహా అనేక ఇతర దేశాలు ఇప్పటికే విద్యార్థులకు మొబైల్ ఫోన్లను నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నాయని అన్నారు. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం కూడా మైనర్ విద్యార్థులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైస్ ఛాన్సలర్కు విద్యా రంగం గురించి లోతైన అవగాహన ఉన్నందున, ఈ విధానాన్ని అమలు చేయడంలో ఆయన అభిప్రాయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?