Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా
- రూ.58 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్న బీసీసీఐ
- ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ప్రైజ్ మనీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.58 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. అయితే ఎవరికెంత మొత్తం లభిస్తుందో బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.
Read Also: Digital Arrest: 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’.. రూ. 20 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు..
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ విజయాన్ని భారత క్రికెట్ కోసం గర్వించదగిన ఘట్టంగా అభివర్ణించారు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలుచుకోవడం ప్రత్యేకమైన విషయమని.. ఇది టీమిండియా నిబద్ధత, ప్రతిభకు గుర్తింపుగా నిలుస్తుందని అన్నారు. భారత క్రికెట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఈ విజయం మరోసారి రుజువు చేసిందని బిన్నీ తెలపారు. 2025లో టీమిండియా గెలుచుకున్న ఇది రెండవ ఐసీసీ ట్రోఫీ.. గతంలో అండర్-19 మహిళల జట్టు కూడా ప్రపంచకప్ను గెలుచుకుందని అన్నారు. ఇది దేశంలోని క్రికెట్ అభివృద్ధికి బలమైన ఉదాహరణ అని బిన్నీ పేర్కొన్నారు.
Read Also: Vikarabad District: కన్న కొడుకునే దారుణంగా హత్య చేసిన తల్లి.. సహకరించిన భార్య..
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి, వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి ఫైనల్కు చేరుకుంది. మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత.. పాకిస్థాన్ను కూడా అదే తేడాతో ఓడించింది. న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ స్టేజ్ను విజయవంతంగా ముగించింది. సెమీ-ఫైనల్లో, ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. మార్చి 9న న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.. కాగా, ఐసీసీ ప్రైజ్ మనీ (రూ.19.50+కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ కావడం గమనార్హం.
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!