Digital Arrest: 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’.. రూ. 20 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు..
- 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’..
- సీబీఐ అధికారులమని నటించిన మోసగాళ్లు..
- రూ. 20 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Arrest: దేశంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు పెరుగుతున్నాయి. తాజాగా, ముంబైకి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’కి గురైంది. సీబీఐ అధికారుమని బెదిరించిన మోసగాళ్లు ఆమె వద్ద నుంచి రూ.20 కోట్లు కొల్లగొట్టారని గురువారం పోలీసులు తెలిపారు. మహిళ నుంచి డబ్బు వసూలు చేయడానికి సీబీఐ అధికారులుగా నటిస్తూ బెదిరించాడని, 2024 డిసెంబర్ 26 నుంచి ఈ సంవత్సరం మార్చి 3 మధ్య జరిగిన ఈ నేరానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
నిందితులు బాధితురాలిని రెండు నెలల పాటు ఇంట్లోనే ఉండేలా చేసి, ప్రతీ మూడు గంటలకు ఒకసారి ఫోన్ చేసి ఆమె ఎక్కడ ఉందో తనిఖీ చేసేవారని పోలీసులు తెలిపారు. సైబర్ పోలీసులు ఆ మహిళకు చెందిన రూ. 77 లక్షల్ని స్తంభింపజేయగలిగారు. ఈ నెల ప్రారంభంలో ఆ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. తనకు సీబీఐ అధికారులమని చెప్పుకుంటున్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని, తన ఆధార్ కార్డు ద్వారా మనీలాండరింగ్ కోసం ఒక బ్యాంక్ ఖాతా తెరిచారని చెప్పాడని వెల్లడించింది. సదరు నేరగాడు ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తుందని, ఆమె తన గదిలోనే ఉండాలని చెప్పి, మాట వినకుంటే డిజిటల్ అరెస్ట్ చేస్తామని, ఆమె పిల్లల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించినట్లు తెలిసింది.
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
Read Also: Chahal-Dhanashree: చాహల్, ధనశ్రీ వర్మల వివాహబంధానికి తెర.. కోర్టు విడాకులు మంజూరు
ఆ ఇంట్లో పనిమనిషి, వృద్ధ మహిళ ప్రవర్తనను గమనించింది. కేవలం ఆహారం కోసం మాత్రమే ఆ గది నుంచి బటయకు రావడం, గదిలోకి వెళ్లి గట్టి అరవడం గురించి పనిమనిషి ఆమె కుమార్తెకు తెలిపింది. అయితే, వృద్ధురాలని భయపెట్టిన మోసగాళ్లు ఆమె బ్యాంక్ వివరాలను రాబట్టారు. కేసు, కోర్టు ఫీజుల నుంచి తొలగించడం వంటి కారణాలు చూపుతూ నెల వ్యవధిలో ఆమె నుంచి రూ. 20.26 కోట్లు బలవంతంగా వసూలు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు, డబ్బు వివిధ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. వీటిలో ఒకటి మలాడ్ ప్రాంతానికి చెందిన షాయల్ జమీల్ షేక్(20) అని గుర్తించారు. 2024 డిసెంబర్ 26 మరియు ఈ సంవత్సరం మార్చి 3 మధ్య జరిగిన ఈ నేరానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
జమీల్ షేక్ పట్టుబడిన తర్వాత, నిందితుడు రజిక్ అజాన్ బట్(20)ని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం పోలీసులు మరో నిందితుడు హృతిక్ శేఖర్ ఠాకూర్ (25) ను గుర్తించి, అతని ఖాతాలో రూ. 9 లక్షలు బదిలీ అయ్యాయని, అతన్ని అర్థరాత్రి అరెస్టు చేశారని ఆయన తెలిపారు. అజాన్ బట్ అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల రాకెట్లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!