Vikarabad District: కన్న కొడుకునే దారుణంగా హత్య చేసిన తల్లి.. సహకరించిన భార్య..
- ఇంటి ముందు నిద్రిస్తున్న కొడుకు
- ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసిన తల్లి
- హత్యకు సహకరించిన భార్య
- వికారాబాద్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటి ముందు నిద్రిస్తున్న కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టి హత్యకు ఒడిగట్టింది తల్లి హత్యకు భార్య కూడా సహకరించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మొదట అనుమానాస్పద మృతిగా వందతులు వచ్చినా.. దారుణ హత్య చేశారని పుకార్లు వినిపించాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. తల్లి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. మంగళవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రించాడు. బుధవారం తెల్లవారు జామున వెంకటేష్ రక్తపు మడుగులో శవమై కనిపించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
READ MORE: Miss World: నా మిస్ వరల్డ్ ప్రయాణం భారత్లోనే ప్రారంభం: క్రిస్టినా పిస్కోవా
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డి.ఎస్.పి బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ శ్రీధర్ రెడ్డితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మృతుని వెంకటేష్ను అతని తల్లి లక్ష్మమ్మ, భార్య సబితాలే హత్యచేసి ఉంటారని గ్రామంలో పుకార్లు వినిపించాయి. మద్యానికి బానిసైన వెంకటేష్ నిత్యం వేధింపులకు పాల్పడుతుండటంతో ఈ ఘాతునికి పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఆరోపణలతో పాటు మృతుడి తమ్ముడు శ్రీనివాస్, తన అన్న మృతిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేశాడు. మరోవైపు పోలీసులు తల్లి, భార్యలను అదుపులోకి తీసుకొని విచారించారు. వెంకటేష్ రోజు మద్యం తాగి వచ్చి వేధించేవాడని వేధింపులు ఎక్కువ కావడంతో వెంకటేష్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నారు. తల్లి భార్య పథకం ప్రకారం ఇంటి ముందు నిద్రిస్తున్న వెంకటేష్ తలపై ఇనుప రాడ్తో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావం జరిగి మరణించాడని పోలీసులు తెలిపారు. హత్యకు ఒడిగట్టిన తల్లి, భార్యపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
READ MORE: MS Dhoni: ఐపీఎల్లో ధోని ఉన్నన్ని రోజులు స్టేడియాలు పసుపెక్కాల్సిందే..
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?