Minister Nadendla Manohar: ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం
- దీపం-2 పథకం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
- ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిపై ఛాలెంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: తిరుపతిలో దీపం-2 పథకం కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిపై ఛాలెంజ్ విసురుతున్నానని.. వైసీపీ నేతలు దీపం-2 పథకం కార్యక్రమాలకు రావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉచిత సిలిండర్ ఇస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలన్నారు. వైసీపీ నేతలు చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. దేశంలో ఎక్కడా లేని దీపం పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిజాయితీతో, చిత్తశుద్థితో పనిచేస్తోందని చెప్పారు. బటన్ నొక్కామని ప్రజలను నిత్యం మోసం చేసిన వారెవరో ప్రజలకు తెలుసన్నారు. మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకాన్ని తీసుకొచ్చామన్నారు.
Read Also: CM Chandrababu: రెండు మూడు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక
Also Read
వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామన్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రాన్ని 11లక్షల అప్పులో నెట్టారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఏపీలో 55లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి..50లక్షల మందికి సిలిండర్లను అందజేస్తామన్నారు. నవంబర్ నుంచి మార్చి వరకు సిలిండర్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. సిలిండర్లు బుక్ చేసిన 24 గంటల్లోపే అర్హులైన వారి ఖాతాలో డబ్బులు జమ అవుతుందన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది అర్హులైన వారు ఇప్పటి వరకు సిలిండర్లను బుక్ చేశారని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరిస్థితిని మార్చేందుకు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దీపం పథకాన్ని తీసుకొచ్చామన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!