Bandi Sanjay : అక్టోబర్ 15 నుండి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర
Bandi Sanjay 5th Phase praja Sangrama Yatra
ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవలే ఆయన నాల్గవ విడత ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర ముగిసింది. అయితే.. తాజాగా ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 15 నుండి బండి సంజయ్ 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్రను భైంసా నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భైంసా నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
అంతేకాకుండా.. బాసర అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేసి భైంసా నుండి యాత్రను బండి సంజయ్ మొదలు పెట్టనున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. అయితే.. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 48 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 1260 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు బండి సంజయ్. గత ఏడాది ఆగస్ట్ 28 న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు.
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?