Indonesia: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. 11 మంది టీచర్లు, విద్యార్థుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. సుబాంగ్లో జరిగిన బస్సు ప్రమాదంలో విద్యార్థులతో సహా 11 మంది ఉపాధ్యాయులు మరణించారు. గ్రాడ్యుయేషన్ ముగించుకుని తిరిగి ఇంటికి బస్సులో వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘోరం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్నాతకోత్సవం ముగించుకుని తిరిగి వస్తుండగా అదుపుతప్పిన బస్సు ప్రమాదానికి గురైంది. శనివారం సాయంత్రం 6:45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
ఇది కూడా చదవండి: Kareena Kapoor: ఆ పదం వాడినందుకు కరీనా కపూర్ కు షాక్?
Also Read
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వాహనం బండంగ్లోని కొండ రిసార్ట్ ప్రాంతం నుంచి పశ్చిమ జావాలోని డిపోక్కు వెళుతున్నప్పుడు (స్థానిక కాలమానం ప్రకారం) సాయంత్రం 6:45 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. దిగువ రహదారిపై బస్సు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టిందని పశ్చిమ జావా పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. బస్సు బ్రేకులు సరిగా పనిచేయడం లేదని నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి: Pakistan: ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య దాడులు.. ఏడుగురు పోలీసులు మృతి
బస్సులో 61 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో తొమ్మిది మంది మరణించగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారు. మృతుల్లో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు, ద్విచక్రవాహనదారుడు ఉన్నారు. మరికొందరికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పశ్చిమ జావా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. తీవ్రంగా గాయపడ్డ బాధితులకు 18 శస్త్రచికిత్సలు జరిగాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Kona Venkat: కోన వెంకట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు
తాజావార్తలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..