Ashok Gehlot: నేను రావణుడినైతే.. కేంద్ర మంత్రిపై మండిపడిన గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot: తనను “రావణ్” అని పిలిచినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఎదురుదాడికి దిగారు. సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెకావత్ ప్రమేయాన్ని గెహ్లాట్ ప్రస్తావిస్తూ, “నేను రావణుడినైతే, నువ్వు రాముడివి అయ్యి, పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి ఇవ్వు” అని అన్నారు. “మీరు నాపై రాళ్లు వేస్తే, పేదలకు ఇళ్లు నిర్మించడానికి నేను వాటిని ఉపయోగిస్తాను” అని బీజేపీ నాయకుడికి సవాల్ విసిరారు. హనుమాన్గఢ్లోని రావత్సర్ పట్టణంలోని ద్రవ్యోల్బణ సహాయ శిబిరాన్ని సందర్శించిన అనంతరం జరిగిన సభలో గెహ్లాట్ మాట్లాడుతూ.. ఈ కుంభకోణంలో షెకావత్ స్నేహితులు జైలులో ఉన్నారని, కేంద్ర మంత్రి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. షెకావత్ దోషి అయితే నైతిక కారణాలతో రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ బర్తరఫ్ చేయాలని ఆయన అన్నారు.
Read Also: Poonch Terror Attack: పూంచ్ దాడిలో సంచలన విషయం.. ఉగ్రవాదులకు స్థానికుల సాయం..
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
గురువారం చిత్తోర్గఢ్లో జరిగిన బీజేపీ జన్ ఆక్రోశ్ ర్యాలీలో షెకావత్ మాట్లాడుతూ.. “రాజస్థాన్లో ఈ రాజకీయ రావణుడైన అశోక్ గెహ్లాట్ పాలనను మీరు అంతం చేయాలనుకుంటే, చేతులు పైకెత్తి రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించండి” అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గెహ్లాట్ శుక్రవారం స్పందిస్తూ, “ఈ రోజుల్లో, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర బీజేపీ నాయకులు నన్ను దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. నేను రావణుడినా? మీరు (షెకావత్) సంజీవని సొసైటీలో 2.5 లక్షల మందిని దోచుకున్నారు. మీ స్నేహితులు జైల్లో ఉన్నారు. మీరు ఎప్పుడైనా జైలుకు కూడా వెళ్లవచ్చు. ఈ కుంభకోణానికి సంబంధించి షెకావత్ అరెస్టుపై రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్ బెంచ్ ఇటీవల స్టే విధించింది.” అని చెప్పుకొచ్చారు. ఈ కుంభకోణంతో తనకు సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్ర మంత్రి గెహ్లాట్పై ఢిల్లీ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు.షెకావత్ అరెస్ట్పై హైకోర్టు స్టే విధించడాన్ని గెహ్లాట్, ప్రస్తావిస్తూ.. “అతను(షెకావత్) హైకోర్టు నుంచి స్టే తీసుకున్నాడు. నేనేమీ నిందితుడిని కాను అని ఆయన చెప్పేవారు. మీరు నిందితులు కాకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు? నీకు బెయిల్ ఎందుకు వచ్చింది?” అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!