Poonch Terror Attack: పూంచ్ దాడిలో సంచలన విషయం.. ఉగ్రవాదులకు స్థానికుల సాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూంచ్లో ఆర్మీ వాహనంపై దాడి ఘటనలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన 6 మంది వ్యక్తుల ప్రమేయం ఉందని, అందులో ఒకరి కుటుంబం మొత్తం కుట్రలో భాగమేనని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు పూర్తి ప్రణాళికతో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, హ్యాండ్ గ్రెనేడ్లు, నగదుతో సహా లాజిస్టిక్స్లో సహాయం చేశారని ఆయన చెప్పారు.
ఏప్రిల్ 20న పూంచ్లోని తోట గలి వద్ద ఆర్మీ ట్రక్కు మెరుపుదాడి చేయడంతో 221 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. వీరిలో దాదాపు అరడజను మందిని అధికారికంగా అరెస్టు చేశారు. పూంచ్పై దాడి కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిలో నిసార్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మరియు ముస్తాక్ అహ్మద్ మెంధార్ సబ్ డివిజన్కు చెందిన వారని అంగీకరించారు.
Also Read:Gold Price Today: ఆభరణాల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. తులం బంగారం ఎంతంటే?
Also Read
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
ఆర్మీ ట్రక్కును లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రవాదులు 7.62 ఎంఎం స్టీల్ కోర్ బుల్లెట్లు, ఐఈడీలను ఉపయోగించారని డీజీపీ తెలిపారు. నిందితుడు నిసార్ అహ్మద్ గురించి డీజీపీ వివరిస్తూ 1990లలో ఓవర్గ్రౌండ్ వర్కర్ కావడంతో, పోలీసులు అతన్ని ఇంతకు ముందు కూడా పట్టుకున్నారని చెప్పారు. అందుకే ఈసారి కూడా ఆయనపై అనుమానం వచ్చింది. ఈ దాడి కుట్రలో అతనే కాకుండా అతని కుటుంబ సభ్యులందరి ప్రమేయం ఉందని విచారణలో తేలింది.
గత రెండు-మూడు నెలలుగా నిసార్ అహ్మద్, అతని కుటుంబం ఉగ్రవాదులకు ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాకిస్థాన్ డ్రోన్ ద్వారా ఒక సరుకును పంపింది. దానిని నిసార్ ఉగ్రవాదులకు అందించాడు. సరుకులో నగదు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, హ్యాండ్ గ్రెనేడ్లు ఉన్నాయి. ఈ మాడ్యూల్ను బహిర్గతం చేయడంతో ఇప్పుడు ముందుకు వెళ్లే మార్గం సుగమమైందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పారు. దాడి చేసిన వ్యక్తులు రెండు మూడు నెలల పాటు భట్ ధురియన్ అడవుల్లోని సహజ గుహల్లో విడిది చేసి ఉంటారని భావిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఇప్పుడు నిందితుల ఆచూకీ, లాజిస్టిక్స్ ఎలా ఏర్పాటు చేశారు తదితర అంశాలపై దర్యాప్తు చేయనున్నారు.
Also Read:Gold Price Today: ఆభరణాల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. తులం బంగారం ఎంతంటే?
తాజావార్తలు
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!