Koti Deepotsavam 2025 : హైదరాబాద్లో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 వేడుకలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. భక్తి టీవీ -ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవం దేశవ్యాప్తంగా విశేషమైన ప్రాధాన్యం సంతరించుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. Off The Record: ఆ మాజీ డిప్యూటీ సీఎం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా..? వైసీపీలో పడరాని…
అఖండ గోదావరి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృధి చేస్తాం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజమండ్రిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందదాయకమన్నారు. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా చేస్తామన్నారు. రాజమండ్రిని వారసత్వ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపుకు చర్యలు తీసుకుంటాం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రలు…
Akhanda Godavari Project: కూటమి ప్రభుత్వం నేపథ్యంలో జూన్ 26న అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. చిరకాల వాంఛగా ఉన్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తాజాగా ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈనెల 26న అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారని అయన తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. 127 సంవత్సరాల రాజమండ్రి…
భగవద్గీత, భరత ముని నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో వీటిని చేర్చారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణం అని ఆయన అభివర్ణించారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు చేరాయి. అందులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లకు చోటు దక్కింది. అంతేకాకుండా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుండేలాల రాజభవన కోటలు సహా ఆరు ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం భారతదేశ తాత్కాలిక జాబితాలో చేర్చిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం తెలిపారు.
BJP: బంగ్లాదేశ్ అల్లర్లు, హింసను ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. భారత్లో కూడా ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో, భారత్లో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు
Rajasthan: ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తర్వాత ఇప్పుడు అందరి చూపు రాజస్థాన్పైనే ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరన్న సస్పెన్స్ ఈరోజు వీడనుంది. ఈ రోజు జరిగే బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి పేరును ఆమోదించనున్నారు.
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలపై గురువారం ఈడీ దాడులు చేపట్టగా.. మరోవైపు సీఎం గెహ్లాట్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ను టార్గెట్ చేశారు.
గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ను 'అబద్ధాల మూట'గా ఆయన అభివర్ణించారు. సీఎం గెహ్లాట్ను ఉద్దేశించి.. తనకు రాష్ట్రంపై అంత శ్రద్ధ ఉంటే 2018లో సీఎం అయిన వెంటనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి ఎందుకు అమలు చేయలేదన్నారు.