Asaduddin Owaisi : అల్లా మా రూలర్.. అల్లా కోసమే ఉన్నాం.. అల్లా కోసమే పని చేస్తున్నాం..
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించింది. మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. సభకు ముందు ఎంఐఎం తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించింది. నాంపల్లి దర్గా నుంచి లక్డికాపూల్ హాకీ స్టేడియం వరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ బీజేపీలు హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో సమైక్యం చేసేటప్పుడు ఎక్కడున్నాయి.? అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలు పర్సెంటేజ్ పరంగా తక్కువగా ఉన్న అందరిని కలుపుకుని పోతామని ఆయన అన్నారు. నిజాం కాలంలో కట్టినవే ఇంకా హైదరాబాద్ లో ప్రముఖంగా ఉన్నాయని, హై కోర్ట్, ఉస్మానియా హాస్పిటల్ లాంటివన్నీ నిజాం కట్టినవే అని ఆయన అన్నారు. హైదరాబాద్ ను కలపడానికి పోలీస్ చర్య జరిగిందని, పండిట్ సుందర్ లాల్ ఇచ్చిన నివేదికలో ముస్లింలపై జరిగిన ఘటనలు వివరించారన్నారు. రజాకార్ల ఏరివేత పేరుతో ముస్లింలపై దారుణాలు చేశారు.. ఈ ఘటనలు నివేదికలో ఉన్నాయని, ఈరోజు హైదరాబాద్ కు అమిత్ షా వచ్చారు.. అబ్బధాలు చెప్పారన్నారు అసదుద్దీన్.
Also Read : IND vs SL Final: ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా.. భారత్ బౌలర్లు మెరుపు దాడి
Also Read
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
అంతేకాకుండా..’బీజేపీ పాత్ర ఏముందని వేడుకలు చేస్తున్నారు.? హైదరాబాద్ గురించి అమిత్ షా మాట్లాడుతున్నారు.. నిజాం, రజాకార్లు అంటున్నాడు చరిత్ర తెలియంది మాట్లాడుతున్నారు.. చేసిందేం లేదు కానీ మేమే చేస్తున్నాం అని చెప్తున్నాడు.. అమిత్ షా ని అడుగుతున్నాను.. అప్పుడు చెడ్డి వేసుకుంటుండే.. ఇప్పుడెందుకు ప్యాంట్ వేసుకుంటున్నారు.. ( ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి.. ). 95 శాతం చేసిన వారి దగ్గరికి వచ్చి ఐదు శాతం చేసి అంతా మేమే చేశాం అంటే ఎలా.? అల్లా మా రూలర్, అల్లా కోసమే ఉన్నాం, అల్లా కోసమే పని చేస్తున్నాం.. హర్యానాలోని నూహ్ లో జరిగింది ఏంటి.? ఎంతో మంది ఇళ్లను కాల్చేస్తున్నారు.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అంటున్నారు ఇదేనా.? దేశంలో జరుగుతుంది చూస్తే తెలుస్తుంది.! కాంగ్రెస్ బిజెపిలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు ఏం చేస్తున్నాయి.. కాంగ్రెస్ బీజేపీలు మజ్లీస్ కు అంటాయి కానీ ముస్లింలకు చేసింది చెప్పవు.. తెలంగాణలో ముస్లిం పిల్లలకు హాస్టల్స్ ఉన్నాయి.. మెడికల్ సీట్స్ వస్తున్నాయి.. దారుసలాం అసదుద్దీన్ ది కాదు మీది.. దారుసలాంకు ఎవరైనా రావచ్చు.. దేశంలోని ఎవరైనా రావచ్చు..’ అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
Also Read : Kushi: ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
-
Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
-
Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
-
Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?