Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Chandrababu Spoke About Vizag Steel Plant

AP CM Chandrababu: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాం..

Published Date :September 17, 2024 , 9:38 pm
By Mahesh Jakki
  • విశాఖ ఉక్కుని శాశ్వతంగా లాభాల బాట పట్టేలా కార్యాచరణ ప్రణాళిక చేస్తాం
  • విశాఖ ఉక్కు రాష్ట్రానికి సెంటిమెంటు
  • ప్రైవేటు పరం కానీయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తాం
  • సీఎం చంద్రబాబు వెల్లడి
AP CM Chandrababu: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP CM Chandrababu: విశాఖ ఉక్కుని శాశ్వతంగా లాభాల బాట పట్టేలా కార్యాచరణ ప్రణాళిక చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్రానికి సెంటిమెంటు అని, ప్రైవేటు పరం కానీయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి గత ప్రభుత్వ వైఖరి కూడా ఓ కారణమని విమర్శించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ కాకుండా.. గతంలో ఆపింది తానేనని సీఎం తెలిపారు. కేంద్ర మంత్రి కుమార స్వామితో మాట్లాడానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొంత డబ్బులిచ్చి ఆపరేట్ చేయడానికి ముందుకెళ్తున్నారని.. ఉద్యోగులు, కార్మికులు కూడా ఆలోచించుకోవాలన్నారు. బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకుని.. శాశ్వతంగా లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నీ లాభాల్లో ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లోకి వస్తుందో ఆలోచించాలన్నారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ హక్కు అనేది నిరూపించుకోవాలంటే కష్టపడి పని చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు సర్వ శక్తులా ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Read Also: CM Chandrababu: వరద బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన.. నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు

గత ఐదేళ్లల్లో ఎప్పుడైనా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటూ సీఎం ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్దామని నాడు సీఎంగా ఉన్నప్పుడు స్పందించారా అంటూ వ్యాఖ్యానించారు. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారా అన్న ఆయన.. ఏం చెప్పినా నమ్మే రోజులు పోయాయన్నారు. కొత్త మెడికల్ కాలేజీల గురించి జగన్ ఎలాంటి జీవోలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో జగన్ ఎలాంటి జీవోలిచ్చారో చదువుకోవాలన్నారు. నిన్న వాళ్లేం చేశారో మరిచి.. ఇప్పుడు విమర్శలు చేస్తే చెల్లుతుందా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాహితం కోసం కొందరు పని చేస్తుంటే.. ప్రజలకు నష్టం కలిగించేందుకు ఇంకొందరు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితుడైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతాం.. దీని కోసం చట్టం తెస్తామని ప్రకటించారు.బుడమేరు దురాక్రమణలు తొలగించాలి.. తొలగిస్తామన్నారు. వరద ప్రాంతాల్లోని విద్యార్థులకు పుస్తకాలిస్తామని పేర్కొన్నారు. కేంద్రాన్ని వరద సాయం అడుగుతున్నాం.. వచ్చాక చెబుతామన్నారు. అమరావతి నీట మునుగుతోందని కొందరు బుద్ది జ్ఞానం ఉంటే మాట్లాడగలరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదు, బెంగళూరు, బాంబే సిటీల పరిస్థితేంటీ..ఇంటి మీద నీళ్లొస్తే ఆకాశం మీదకు వెళ్తారా అంటూ ప్రశ్నించారు. హుదూద్ వస్తే విశాఖ ఏమైంది.. పులివెందుల్లో పెట్టాలా అంటూ ప్రశ్నలు గుప్పించారు.

Read Also: Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజ‌ర్వేష‌న్‌పై రేపు చ‌ర్చలు

కర్నూలుకు వరదలు రాలేదా అంటూ ప్రశ్నించారు. నీళ్లల్లో దిగని వారు.. బురదలో దిగడానికి ఆలోచించే వాళ్లు రాజకీయాలకు పని కొస్తారా అంటూ ఎద్దేవా చేశారు. నడవలేని ముసలి వాళ్లు పెన్షన్ డబ్బులిచ్చి వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా ముంపు బాధితులకు సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజకీయ విద్వేషాలు ఉండే వారు తప్ప ప్రజలు అంతా ఉదారంగా స్పందించి సాయం అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. 32 వార్డుల పరిధిలో మున్సిపల్ టాక్స్ గడువు కూడా మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు వరద సాయం కింద రూ. 300 కోట్లు విరాళాలిచ్చారని.. మరో రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లు వరకు విరాళాలు రావచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP CM Chandrababu
  • ap floods
  • ap news
  • Special Package for Flood Victims

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions