Anjan Kumar Yadav : కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని, ఈ డబ్బంతా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు వెళ్లిందని మాజీ ఎంపీ ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాలేశ్వరం ఏటీఎం సెంటర్ అంటూ వినూత్న పద్ధతిలో ఏటీఎం సెంటర్ ఏర్పాటుచేసి నిరసన వ్యక్తం చేశారు. ఏటీఎం సెంటర్ ను ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ లు హాజరై ప్రారంభించారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు , యువకులు , నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక దశాబ్ది కాలంగా జరిగిన పెద్ద స్కాం కాలేశ్వరం ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు.
Also Read : Mamata Banerjee: ఎన్నికల ముందే ప్రతిపక్ష నేతల అరెస్టుకు బీజేపీ కుట్ర..
Also Read
సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి , కుంభకోణాలు , అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బిఆర్ఎస్ , బిజెపి , ఎంఐఎంలు ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాకుండా మద్యం షాపులు , బెల్టుషాపుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. దేశ ప్రధాని , సీఎం కేసీఆర్ ఒక్కటేనని ఇద్దరు కలిసి దేశాన్ని , రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు గుణపాఠం చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
Also Read : Neha Shetty : చీర కట్టులో నేహా శెట్టి పరువాల విందు మాములుగా లేదుగా..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!