Rs 20,000 Fine For Driving With Earphones: ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల ఫైన్..? అసలు విషయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs 20,000 Fine For Driving With Earphones: డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత ఎంతో ముఖ్యం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే.. ఎవరి ప్రాణాలకైనా ముప్పు తప్పకపోవచ్చు.. ఇక, హెడ్సెట్లు, బ్లూటూత్లు, ఇయర్బడ్స్.. ఇలా రకరకాల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అవి ధరించి డ్రైవింగ్ చేసేవాళ్లు వెనకాల నుంచి ఎవరైనా హారన్ కొట్టినా.. చుట్టుపక్కల ఏదైనా జరిగినా వెంటనే గుర్తించలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.. హెడ్సెట్ పెట్టుకుని ఫోన్లు మాట్లాడేవారు కొందరైతే.. మ్యూజిక్ ఎంజాయ్ చేసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.. ఇలా చాలా మంది కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు.. అయితే, వీటికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.. ఇకపై బైక్ మీద కానీ, కారులో కానీ, ఆటోలో కానీ.. ఇయర్ఫోన్స్ లేదా హెడ్సెట్ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.. ఇది ఆగస్టు నెల నుంచి అమల్లోకి వస్తుందని పలు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది.
Read Also: Visakhapatnam: 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. విశాఖ కోర్టు సంచలన తీర్పు
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
అయితే, ఏపీ రవాణాశాఖ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. రూల్స్ పాటిస్తే.. ఈ ఫైన్ల గొడవ ఉండదని కొందరు చెబుతుంటూ.. సామాన్యులను బతకనివ్వరా? హెడ్సెట్ పెట్టుకుంటే రూ.20వేలు జరిమానా విధిస్తారా? ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ నిలదీసేవాళ్లు మరికొంతమంది.. ఇక, సోషల్ మీడియాలో జరుగుతోన్న ఆ ప్రచారంపై ఏపీ రవాణా శాఖ కమిషనర్ స్పందించారు.. ఇదంతా వట్టిదేనని కొట్టిపారేశారు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.. అయితే, మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ దొరికిపోతే మొదటిసారి రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.. అంతేకాదు.. ఇలా పదేపదే పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నిబంధనలు.. ఎంతో కాలం నుంచి అమలు చేస్తున్నామని.. జరిమానా పెంపు ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణా శాఖ కమిషనర్.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!