Rs 20,000 Fine For Driving With Earphones: ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల ఫైన్..? అసలు విషయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs 20,000 Fine For Driving With Earphones: డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత ఎంతో ముఖ్యం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే.. ఎవరి ప్రాణాలకైనా ముప్పు తప్పకపోవచ్చు.. ఇక, హెడ్సెట్లు, బ్లూటూత్లు, ఇయర్బడ్స్.. ఇలా రకరకాల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అవి ధరించి డ్రైవింగ్ చేసేవాళ్లు వెనకాల నుంచి ఎవరైనా హారన్ కొట్టినా.. చుట్టుపక్కల ఏదైనా జరిగినా వెంటనే గుర్తించలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.. హెడ్సెట్ పెట్టుకుని ఫోన్లు మాట్లాడేవారు కొందరైతే.. మ్యూజిక్ ఎంజాయ్ చేసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.. ఇలా చాలా మంది కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు.. అయితే, వీటికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.. ఇకపై బైక్ మీద కానీ, కారులో కానీ, ఆటోలో కానీ.. ఇయర్ఫోన్స్ లేదా హెడ్సెట్ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.. ఇది ఆగస్టు నెల నుంచి అమల్లోకి వస్తుందని పలు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది.
Read Also: Visakhapatnam: 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. విశాఖ కోర్టు సంచలన తీర్పు
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
అయితే, ఏపీ రవాణాశాఖ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. రూల్స్ పాటిస్తే.. ఈ ఫైన్ల గొడవ ఉండదని కొందరు చెబుతుంటూ.. సామాన్యులను బతకనివ్వరా? హెడ్సెట్ పెట్టుకుంటే రూ.20వేలు జరిమానా విధిస్తారా? ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ నిలదీసేవాళ్లు మరికొంతమంది.. ఇక, సోషల్ మీడియాలో జరుగుతోన్న ఆ ప్రచారంపై ఏపీ రవాణా శాఖ కమిషనర్ స్పందించారు.. ఇదంతా వట్టిదేనని కొట్టిపారేశారు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.. అయితే, మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ దొరికిపోతే మొదటిసారి రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.. అంతేకాదు.. ఇలా పదేపదే పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నిబంధనలు.. ఎంతో కాలం నుంచి అమలు చేస్తున్నామని.. జరిమానా పెంపు ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణా శాఖ కమిషనర్.
తాజావార్తలు
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
-
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?