India-Russia: భారత్పై అమెరికా విమర్శలు.. ఖండించిన రష్యా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Russia: ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ కేసులో భారత్కు రష్యా అండగా నిలిచింది. అమెరికా వాదనలను మాస్కో తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా ‘భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని’ ఆరోపించింది. గత ఏడాది నవంబర్లో అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాపై అభియోగాలు మోపింది. ఇటీవల, వాషింగ్టన్ పోస్ట్ నివేదికలో పన్నున్ హత్యకు కుట్రలో రా అధికారి ప్రమేయం ఉందని పేర్కొంది.
Read Also: Daggubati Purandeswari: బొత్సకు పురంధేశ్వరి కౌంటర్..
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
భారత్ అంతర్గత రాజకీయ పరిస్థితులను అసమతుల్యత చేసేందుకు అమెరికా ఇప్పుడు ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు. ‘వాషింగ్టన్లో భారతదేశ జాతీయ మనస్తత్వం, చరిత్రపై సాధారణ అవగాహన లేదన్నారు. ఎందుకంటే మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోంది అన్నారు. అమెరికా కార్యకలాపాలు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొనింది. అలాగే, భారతదేశంతో పాటు ఇతర దేశాలపై కూడా అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తుండటంపై రష్యా అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Salman Khan Case: కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్
గురుపత్వంత్ సింగ్ పన్నూని చంపడానికి విఫలమైన పథకంలో గుప్తా ప్రమేయం ఉందని రష్యా ఆరోపించారు. ఇక, పన్నున్ అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నాడు.. కాగా, వాషింగ్టన్ పోస్ట్లోని మూలాలను ఉటంకిస్తూ.. పన్నున్ చంపడానికి ఆరోపించిన కుట్రలో RAW అధికారులు ప్రమేయం ఉన్నారని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, రా అధికారి విక్రమ్ యాదవ్ ప్లాన్ కోసం హిట్ టీమ్ను సిద్ధం చేశారని నివేదికలో వెల్లడించింది. ఇక, ఈ ఆరోపణలపై భారత్ ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. వారంలోనే ఈ అంశంపై భారత దర్యాప్తు ఫలితాల కోసం వేచి ఉన్నామని అమెరికా తెలిపింది.
తాజావార్తలు
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!