Alleti Maheshwar Reddy: ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదు..
- ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదు
- ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారు
- రెండు లక్షల రుణమాఫీ చేయకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు
- 64 మంది ఎమ్మెల్యేలను ఉన్నప్పటికీ కాంగ్రెస్ కేవలం ఎనిమిది ఎంపీ సీట్లే గెలిచింది
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది - ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారని పేర్కొన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేయకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కేవలం ఎనిమిది ఎంపీ సీట్లే గెలిచిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. 14 సీట్లు గెలుస్తాం.. తమ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమని ముఖ్యమంత్రి చెప్పారని.. 14 సీట్లు గెలుస్తామని కేవలం 8 సీట్లే గెలిచినందుకు రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ఎన్నికల ముందు డిక్లరేషన్లు ప్రకటించి విస్మరించారని తెలిపారు.
Sree Leela: శ్రీ లీల ఏంటి ఇలా అయిపొయింది?
Also Read
- Mumbai: ముంబైలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త
- Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్పై అసంతృప్తే కారణమా?
- Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
- Flash Floods: అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదులు.. 5 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు, నలుగురు మృతి
ప్రజలను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. తన కుర్చీ కాపాడుకోవడం కోసమే సమయం సరిపోతుందని ఆరోపించారు. ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పుడూ ఇస్తారో స్పష్టం చేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామన్నారు.. స్కూటీలు ఎప్పుడూ ఇస్తారని విద్యార్థినులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది..? రుణమాఫీ కోసం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టుకున్నారు.. 420 హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఎప్పుడూ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
Mahalaxmi Express: రైలులో బిడ్డకు జన్మనిచ్చని ముస్లిం మహిళ.. బిడ్డకు హిందూ దేవత పేరు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి చేతులు దులుపుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ధరణి అవకతవకలను రాష్ట్ర ప్రజల ముందు ప్రభుత్వం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఎన్ని డ్రామాలు చేసిన కేవలం 8 సీట్లలో మాత్రమే ప్రజలు గెలిపించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారో చెప్పాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 18న గవర్నర్ అపాయింట్ మెంట్ కోరానని.. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సీబిఐతో విచారణ జరిపించాలని కోరుతానని తెలిపారు.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త
-
Anurag Kashyap: మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ డైరెక్టర్.. 11 ఏళ్ల రిలేషన్.. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్!
-
Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్పై అసంతృప్తే కారణమా?
-
Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
-
BJP: రాహుల్ గాంధీ ‘‘హగ్’’ కామెంట్స్.. నెహ్రూ ‘‘కిస్’’ ఫోటోలు బయటకు తెచ్చిన బీజేపీ..
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!