Fake Court: ఇదేందయ్యా ఇది.. ఫేక్ కోర్ట్, ఫేక్ జడ్జి
- అహ్మదాబాద్ సివిల్ కోర్టు ముందు.
- నకిలీ న్యాయమూర్తి నకిలీ కోర్టును నడుపుతున్నాడు.
- విషయం రావడంతో నకిలీ న్యాయమూర్తిపై కఠిన చర్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Court: ఇప్పటి వరకు మనం చాలానే ఫేక్ ఐపీఎస్, ఫేక్ ఆఫీస్ విషయాలు సంబంధించిన విషయాలను చూసాము. ఇక తాజాగా ఇప్పుడు నకిలీ కోర్టు, జడ్జి గుట్టు బట్టబయలైంది. ఈ కేసులో గుజరాత్ లోని అహ్మదాబాద్లో నకిలీ కోర్టు పట్టుబడింది. వృత్తిరీత్యా నకిలీ జడ్జిగా, లాయర్గా నటిస్తూ గత కొన్నేళ్లుగా ఈ మోసం వ్యాపారం సాగుతోంది. అసలు విషయం తెలియగానే ప్రజలు షాక్ అవుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నకిలీ న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అహ్మదాబాద్ సివిల్ కోర్టు ముందు నకిలీ న్యాయమూర్తి తన నకిలీ కోర్టును నడుపుతున్నాడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ కోట్ల విలువైన వివాదాస్పద భూములకు సంబంధించిన కేసులో పలు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో కొన్ని ఉత్తర్వులు డీఎం కార్యాలయానికి చేరాయి.
Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. మీసాలు, గడ్డాలు తీయాల్సిందే..!
Also Read
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
అయితే, అక్కడ దీనికి సంబంధించిన కేసు అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తికి చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రిజిస్ట్రార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మోరిస్ క్రిస్టియన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నకిలీ ట్రిబ్యునల్ను సృష్టించి తనను తాను న్యాయమూర్తిగా చెప్పుకున్నాడు. అహ్మదాబాద్ లోని భదర్ లోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్పై కరంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన దాఖలు చేసిన ఫిర్యాదులో, నిందితులు ఇతర వ్యక్తులతో కలిసి ఠాకూర్ బాపూజీ ఛనాజీ పేరుతో నేరపూరిత కుట్ర పన్నారని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి సమాచారం ప్రకారం.. నకిలీ న్యాయమూర్తి మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్పై ఫిర్యాదు వచ్చినప్పుడు, సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని చౌతియా పోలీసులను ఆదేశించారు. నకిలీ కోర్టులో ఉంచిన కంప్యూటర్లు, సీపీయూలు, ఇతర పరికరాలను సీజ్ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు తమ చర్యలను ముమ్మరం చేశారు. అహ్మదాబాద్లోని నకిలీ కోర్టు బయటపెట్టడంతో.. ఓ ఫేక్ జడ్జి ఏళ్ల తరబడి ప్రజలను ఎలా మోసం చేస్తూనే ఉన్నాడని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
తాజావార్తలు
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!