Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. మీసాలు, గడ్డాలు తీయాల్సిందే..!
- కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..
- వారం గడవక ముందే జూనియర్లకు వేధింపులు..
- ర్యాగింగ్ జరిగినట్లు ఫిర్యాదు రాలేదన్న ప్రిన్సిపాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. తరగతులు ప్రారంభమై వారం గడవక ముందే జూనియర్లకు ర్యాగింగ్ వేధింపులు మొదలయ్యాయి. మీసాలు, గడ్డాలు తీసేసుకోవాలని సీనియర్ల హుకుం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లజోడు కూడా తాము చెప్పిన వాటినే పెట్టుకోవాలని, ఆకడమిక్ ఆన్ లైన్ యాప్ లు తాము చెప్పినవి తీసుకోవాలని సమాచారం. తరగతులు అయిన వెంటనే గుంపులు గుంపులుగా వెళ్లి క్యాంపస్ లోనే జూనియర్లను ర్యాగింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల క్రితమే కాలేజీలో ర్యాగింగ్ పై ప్రిన్సిపాల్ యాంటీ ర్యాగింగ్ సమావేశం నిర్వహించగా ఎస్పీ కూడా హాజరయ్యారు. ర్యాగింగ్ నేరమని, ర్యాగింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.
Read Also: Naga Chaitanya : పెళ్లి తర్వాత ముంబైలో కాపురం పెట్టనున్న నాగచైతన్య, శోభిత ?
Also Read
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
గత ఏడాది కూడా ర్యాగింగ్ తో విద్యార్థుల పేరెంట్స్ యూజీసీకి ఫిర్యాదు చేశారు. కమిటీ నియమించి విచారించినా ఎవరిపైనా ఎవరిపైనా చర్యలు తీసుకోని ఫలితంగా ఈ ఏడాది మళ్లీ విద్యార్థులకు ర్యాగింగ్ తప్పడం లేదు. గత ఏడాది మెడికల్ కాలేజీ మేన్స్ హాస్టల్ లో గంజాయి కూడా లభ్యమైంది. మెడికల్ కాలేజీ అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. అయితే, ర్యాగింగ్ జరిగినట్లు ఫిర్యాదు రాలేదన్నారు ప్రిన్సిపాల్ చిట్టి నర్సమ్మ.. హాస్టల్ కి వెళ్లి కొత్త విద్యార్థులతో మాట్లాడానని, ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థులు చెప్పలేదనన్నారు ప్రిన్సిపాల్. చెప్పడానికి విద్యార్థులకు భయం ఉంటే తనకు వాట్సాప్ లో , ఫోన్ చేసి అయినా ఫిర్యాదు చేయవచ్చంటున్నారు ప్రిన్సిపాల్. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ర్యాగింగ్ చేసినట్లు ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు ప్రిన్సిపాల్. ప్రస్తుతం వచ్చిన ర్యాగింగ్ ఆరోపణలపై కమిటీ నియమించి విచారణ జరిపిస్తామంటున్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టినర్సమ్మ..
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్..
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..