Aadi Srinivas : కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారు
- హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా?
- వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా?
- హరీష్ ప్రయత్నాలు కేసీఆర్ కి తెలిసి దూరం పెట్టలేదా? : ఆది శ్రీనివాస్
Aadi Srinivas : హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారని, హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా? అని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా? హరీష్ ప్రయత్నాలు కేసీఆర్ కి తెలిసి దూరం పెట్టలేదా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కొప్పడడం వల్ల హరీష్ రావు వార్తలు సైతం మీడియాలో రాలేదని ఆది శ్రీనివాస్ అన్నారు. హరీష్ రావుకు అన్ని తెలిసినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత హరీష్ రావుకు ఎక్కడిది? అని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు మార్ఫింగ్ సినిమా చూపిస్తున్నాడని, బీఆర్ఎస్ సినిమా అయిపోయిందన్నారు ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోందని, రైతుల వడ్డీలు కూడా బీఆర్ఎస్ కట్టలేకపోయిందన్నారు.
PM Modi-Putin: భారత్లో పర్యటించండి.. పుతిన్కి మోడీ ఆహ్వానం..
Also Read
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు చూసి హరీష్ కండ్లలో నిప్పులు పోసుకుని మాట్లాడుతున్నారన్నారు. పడేండ్లలో రైతులకు 80 వేల కోట్లు వేశామని హరీష్ అబద్ధాలు చెబుతున్నారని, మేం పది మాసాలలో 22 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఆది శ్రీనివాస్. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందని, వాగులు, వంకలు, కొండలు, కొనలకు గత ప్రభుత్వం రైతుబందు వేసిందన్నారు. కౌలు రైతులకు సైతం బోనస్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను పంట చేలల్లో బెదురుకు వాడిన విషయం మర్చిపోవద్దని, గత పదేండ్లలో ఒక్క డీఏస్సీ కూడా వేయలేదన్నారు. కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే లాభం ఏంటి? అని ఆయన వ్యాఖ్యానించారు. మేం ఎవరి లెక్క ఎంతో తేల్చడానికి సర్వే చేస్తున్నామని, బీఆర్ఎస్ నాయకులు బీసీ కుల గణనకు అనుకూలమా? వ్యతిరేకమా? అని ఆది శ్రీనివాస్ అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చాలని కేసీఆర్ అన్నారని, హైదరాబాద్ మునిగిపోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా? అబద్దాలు మాట్లాడే హరీష్ రావు ఇప్పటి నుండైనా నిజాలు మాట్లాడాలని కోరుతున్నానన్నారు.. ఈ సీజన్లో కాళేశ్వరం నుండి ఒక్క చుక్క కూడా వినియోగంలోకి రాలేదన్నారు ఆది శ్రీనివాస్.
Student Suicide: బాచుపల్లి ఇంపల్స్ కాలేజీ హాస్టల్లో విద్యార్ధిని ఆత్మహత్య..
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో