CP Ranganath: కల్తీ మందులు రైతులకు అమ్మితే.. పీడీ యాక్ట్ అమలు చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందులు, కాలం చెల్లిన పురుగు మందులతో రైతులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పురుగు మందులను సీజ్ చేశారు. దీనిపై వరంగల్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు.. రైతన్నను దగా చేస్తూ నకిలీ, గడువు తీరిన పురుగుల మందులు విక్రయిస్తున్న కేటుగాళ్ళ అరెస్టు చేసినట్లు పేర్కొన్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను దగా చేస్తూ నకిలీతో పాటు కాలం చెల్లిన పురుగుల మందులను విక్రయిస్తున్న మూడు ముఠాలోని 13 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు సీపీ రంగానాథ్ అన్నారు.
Read Also: Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 57 లక్షల రూపాయల విలువైన నకిలీ పురుగు మందులు, గడువు తీరిన పురుగుల మందులు, నిషేధిత గడ్డి ముందు, నకిలీ పురుగు మందులు తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీ బాటిల్స్, రవాణాకు వినియోగించే ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీపీ రంగానాథ్ వెల్లడించారు.
Read Also: Kawasaki Ninja 650: భారత మార్కెట్లోకి కవాసకి నింజా 650.. బైక్ ధర రూ.7.16 లక్షలు
అయితే, దాదాపు 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, ఉండగా 30 లక్షల రూపాయల విలువ గల నకిలీ పురుగుల మందులు ఉన్నాయని వరంగల్ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. 3 లక్షల 53 వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నాట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఇద్దరు పర్టిలైజర్ షాప్ యాజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: వాలంటీర్లపై బురద చల్లడానికే చంద్రబాబు ఆరోపణలు
గడువు తీరిన మందులు సైతం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా ఈ ముఠాల గుట్టురట్టైంది అని వరంగల్ సీపీ రంగానాథ్ తెలిపారు. కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీరియస్ యాక్షన్ చేపట్టామని ఆయన వెల్లడించారు. కల్తీలతో మోసానికి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. పురుగుల మందులు కొనే ముందు రైతులు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి అని సీపీ రంగనాథ్ సూచించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!