CP Ranganath: కల్తీ మందులు రైతులకు అమ్మితే.. పీడీ యాక్ట్ అమలు చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందులు, కాలం చెల్లిన పురుగు మందులతో రైతులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పురుగు మందులను సీజ్ చేశారు. దీనిపై వరంగల్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు.. రైతన్నను దగా చేస్తూ నకిలీ, గడువు తీరిన పురుగుల మందులు విక్రయిస్తున్న కేటుగాళ్ళ అరెస్టు చేసినట్లు పేర్కొన్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను దగా చేస్తూ నకిలీతో పాటు కాలం చెల్లిన పురుగుల మందులను విక్రయిస్తున్న మూడు ముఠాలోని 13 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు సీపీ రంగానాథ్ అన్నారు.
Read Also: Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 57 లక్షల రూపాయల విలువైన నకిలీ పురుగు మందులు, గడువు తీరిన పురుగుల మందులు, నిషేధిత గడ్డి ముందు, నకిలీ పురుగు మందులు తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీ బాటిల్స్, రవాణాకు వినియోగించే ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీపీ రంగానాథ్ వెల్లడించారు.
Read Also: Kawasaki Ninja 650: భారత మార్కెట్లోకి కవాసకి నింజా 650.. బైక్ ధర రూ.7.16 లక్షలు
అయితే, దాదాపు 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, ఉండగా 30 లక్షల రూపాయల విలువ గల నకిలీ పురుగుల మందులు ఉన్నాయని వరంగల్ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. 3 లక్షల 53 వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నాట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఇద్దరు పర్టిలైజర్ షాప్ యాజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: వాలంటీర్లపై బురద చల్లడానికే చంద్రబాబు ఆరోపణలు
గడువు తీరిన మందులు సైతం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా ఈ ముఠాల గుట్టురట్టైంది అని వరంగల్ సీపీ రంగానాథ్ తెలిపారు. కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీరియస్ యాక్షన్ చేపట్టామని ఆయన వెల్లడించారు. కల్తీలతో మోసానికి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. పురుగుల మందులు కొనే ముందు రైతులు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి అని సీపీ రంగనాథ్ సూచించారు.
తాజావార్తలు
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!