Onion Price: వారికి ఉల్లిగడ్డ కేజీ రూ.25.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు అనేక నగరాల్లోని ప్రజలకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో నివసించే ప్రజలకు కిలో ఉల్లిని కేవలం 25 రూపాయలకే అందించనుంది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్త.
Malavika Avinash: ఫోన్ చేసి బెదిరింపులు.. చిక్కుల్లో కేజీఎఫ్ నటి.. అసలేమైందంటే?
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
గత ఒకటి, రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి రిటైల్ ధరలు కిలో రూ.100కి చేరాయి. దేశం మొత్తం పండుగ సంబరాల్లో మునిగితేలుతున్న తరుణంలో ఉల్లి ధరలు పెరిగాయి. దీంతో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఓ నివేదిక ప్రకారం.. ఈ వారం చివరి నుండి సఫాల్ మదర్ డెయిరీలో బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయల అమ్మకాలు ప్రారంభమవుతాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
USA: ఇన్సులిన్తో 17 మందిని చంపిన నర్సు..
ప్రస్తుత సంవత్సరానికి ప్రభుత్వం ఐదు లక్షల టన్నుల ఉల్లిపాయల బఫర్ స్టాక్ను నిర్వహించింది. అదనంగా రెండు లక్షల టన్నుల బఫర్ను రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్యల వల్ల ఉల్లి టోకు ధరలు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వం చెబుతోంది. దీని ప్రభావం రిటైల్ మార్కెట్లపై కనిపించడానికి సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. వచ్చే వారం నుంచి రిటైల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.
BSNL Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా ఆఫర్.. ఈ ప్లాన్స్తో డేటా ఫ్రీ..!
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం ఇప్పటికే తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలకు ఉల్లిపాయలను సబ్సిడీపై అందజేస్తోంది. సహకార ఏజెన్సీలు NCCF, NAFED కూడా కేంద్ర ప్రభుత్వం తరపున బఫర్ ఉల్లిపాయలను రాయితీ ధరలకు రిటైల్ చేస్తున్నాయి. NAFED ఇప్పటివరకు 21 రాష్ట్రాల్లోని 55 నగరాల్లో మొబైల్ వ్యాన్లు, స్టేషన్ అవుట్లెట్లతో సహా 329 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు NCCF 20 రాష్ట్రాల్లోని 54 నగరాల్లో 457 రిటైల్ కేంద్రాలను ప్రారంభించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!