Tomato Prices: టమాటా ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సామాన్యుడికి అందుబాటులో ఉన్న టామాటా, ఇప్పుడు భగ్గుమంటోంది. భారతదేశం అంతటా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. దీని వలన వినియోగదారులతో పాటు రిటైలర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్క భారీ వర్షం గురుగ్రామ్ను అతలాకుతలం చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. ఇక సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే ఉద్యోగులంతా నరకయాతన అనుభవించారు.
ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని నటి సదా తీవ్రంగా వ్యతిరేకించారు. రేబిస్ వల్ల ఒక బాలిక మరణించిన సంఘటన ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. సదా ఈ నిర్ణయాన్ని “కుక్కల ఊచకోత”గా అభివర్ణించారు. “ప్రభుత్వం, స్థానిక సంస్థలు లక్షల కుక్కలకు ఆశ్రయాలు, టీకాలు వేయలేకపోవడం వారి అసమర్థత” అని ఆమె ఆరోపించారు. ABC (జంతు జనన నియంత్రణ) కార్యక్రమం సరిగ్గా అమలై ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని…
దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సోమవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియను ఎవరైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది. తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బలమైన గాలుల కారణంగా అశోక్నగర్ మెట్రో స్టేషన్ షెడ్ దెబ్బతింది. ఇక పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరుగుపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్లో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం మధ్యాహ్నం 12:17 గంటలకు భూకంపం సంభవించినట్లుగా తెలిపింది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో విషపూరితమైన గాలి కారణంగా ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది. అయితే గత కొంత కాలంగా ఏటా చలికాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోంది. చల్ల గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు వంటి కాలానుగుణ వాతావరణ పరిస్థితులు ఏటా ఈ సమయంలో ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యాన్ని పెంచుతాయి.
ఢిల్లీ ఎన్సిఆర్లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్లైన్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఫిజికల్ మీడియం ద్వారా పాఠశాలకు వెళ్లేవారు. అలాగే.. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు పొగ మంచు రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం నగరాన్ని పొగమంచు కమ్మేయడంతో సమీప వాహనాలు కూడా కనిపించని దుస్థితి నెలకొంది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు.
Delhi : వాతావరణంలో నిరంతర మార్పులు కనిపిస్తున్నాయి. పర్వతాలపై తాజా హిమపాతం శీతాకాలం ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలో తగ్గుదల కనిపించింది.