JP Nadda: ఐటీ రైడ్స్లో కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ. 300 కోట్లు.. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: భారతదేశంలో జరిగిన ఐటీ రైడ్స్లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా డబ్బులు బయటపడుతున్నాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహూ నివాసాల్లో బుధవారం నుంచి ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 290 కోట్ల నగదు బయటపడింది. ప్రస్తుతం ఇది దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ వ్యవహారంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ..‘‘ మిత్రమా మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఇది న్యూ ఇండియా, రాజకుటుంబాల పేరుతో దోపిడి చేయడాన్ని ప్రజలు అనుమతించరు. మీరు పరిగెత్తడంలో విసిగిపోతారు, చట్టం మిమ్మల్ని విడిచిపెట్టదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
Read Also: Bank Robbery: 15ఏళ్లలో 7 సార్లు బ్యాంకులో చోరీకి దొంగల యత్నం.. ప్రతి సారీ కుక్కలే పరిగెత్తించాయి
కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే.. అవినీతిపై చర్యలు తీసుకుంటామని, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ప్రతీ పైసా వాసస్ ఇవ్వాల్సిందే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా ఉంటోంది.
సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. ఈ వ్యవహారానికి పార్టీకి సంబంధం లేదని చెప్పారు. ఎంపీ ధీరజ్ సాహూ వ్యాపారాలతో ఏ సంబంధం లేదని చెప్పారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్కి ఏటీఎంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒడిశా బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు లేకుండా ఈ పన్ను ఎగవేత సాధ్యం కాదని బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మహాపాత్ర అన్నారు.
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!