JP Nadda: ఐటీ రైడ్స్లో కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ. 300 కోట్లు.. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: భారతదేశంలో జరిగిన ఐటీ రైడ్స్లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా డబ్బులు బయటపడుతున్నాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహూ నివాసాల్లో బుధవారం నుంచి ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 290 కోట్ల నగదు బయటపడింది. ప్రస్తుతం ఇది దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ వ్యవహారంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ..‘‘ మిత్రమా మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఇది న్యూ ఇండియా, రాజకుటుంబాల పేరుతో దోపిడి చేయడాన్ని ప్రజలు అనుమతించరు. మీరు పరిగెత్తడంలో విసిగిపోతారు, చట్టం మిమ్మల్ని విడిచిపెట్టదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read
Read Also: Bank Robbery: 15ఏళ్లలో 7 సార్లు బ్యాంకులో చోరీకి దొంగల యత్నం.. ప్రతి సారీ కుక్కలే పరిగెత్తించాయి
కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే.. అవినీతిపై చర్యలు తీసుకుంటామని, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ప్రతీ పైసా వాసస్ ఇవ్వాల్సిందే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా ఉంటోంది.
సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. ఈ వ్యవహారానికి పార్టీకి సంబంధం లేదని చెప్పారు. ఎంపీ ధీరజ్ సాహూ వ్యాపారాలతో ఏ సంబంధం లేదని చెప్పారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్కి ఏటీఎంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒడిశా బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు లేకుండా ఈ పన్ను ఎగవేత సాధ్యం కాదని బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మహాపాత్ర అన్నారు.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!