Ajit Pawar: మహారాష్ట్రలో కేసీఆర్ విజయం సాధించలేరు.. ఎన్సీపీ నేత కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహరాష్ట్రలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నాగ్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇటీవల నాందేడ్, ఔరంగాబాద్ సభల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై అక్కడి పార్టీలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి.
తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో తన పార్టీని విస్తరించాలని ప్రయత్నించినప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం సఫలం కాలేరని ఆయన సోమవారం అన్నారు. పూణేలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు, మాయావతి, ములాయం సింగ్ యాదవ్లు ఇదే చేశారని అయితే విజయం సాధించలేదని అన్నారు.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
Read Also: PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..
‘‘ములాయం సింగ్ మరియు మాయావతి యుపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వారు అదే పని చేయడానికి ప్రయత్నించారు, కానీ అతను కూడా పెద్దగా విజయం సాధించలేదు … బహుశా కె చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో నాయకుడు కావాలని కోరుకుంటాడు,అందుకే అతను ప్రయత్నిస్తున్నారు’’ అని అజిత్ పవార్ అన్నారు. కేసీఆర్ పార్టీలో చేరుతున్న వారికి ఇక్కడ అవకాశం రాదని తెలుసని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ హోర్డింగ్లను ప్రస్తావిస్తూ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఉన్నప్పుడు బ్యానర్లు, ప్రకటనల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో రాష్ట్రప్రజలు ఆలోచించాలని అజిత్ పవార్ అన్నారు.
ఈ ఏడాది మార్చిలో సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ లో సభను నిర్వహించి, ప్రధాని మోడీతో పాటు, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బీజేపీ, శివసేనలపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో రైతులకు ఇచ్చిన విధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
- Tags
- Ajit Pawar
- BRS
- cm kcr
- Maharashtra
- NCP
తాజావార్తలు
-
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
-
FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
-
US – Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్ ఓటమి.. రోహిత్ సెంచరీ వృథా.. వన్డే సిరీస్ కూడా పాయే!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!