Bengaluru Crime: ప్రియురాలితో శృంగారం చేస్తూ వ్యాపారవేత్త మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శృంగారం మనిషిలో ఉత్సాహాన్ని నింపుతుంది.. ఉత్తేజాన్ని కలిగిస్తోంది.. అంతే కాదు.. ప్రాణాలు కూడా తీస్తుంది.. ఎందుకంటే.. తన ప్రియురాలితో శృంగారం చేస్తూ ఓ వ్యాపారవేత్త మృతిచెందిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది.. అయితే, ఈ ఘటనతో వణికిపోయిన ప్రియురాలు.. ఏం చేయాలో తోచక.. వెంటనే తన భర్త, సోదరుడికి సమాచారం ఇచ్చింది.. దీంతో, ఎవరికీ తెలియకుండా.. ఆ మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. పడవేశారు.. అయితే, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు మొదట ఎలాంటి క్లూ దొరకలేదు.. కానీ, విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.. బెంగళూరు పోలీసులు ప్లాస్టిక్ సంచిలో 67 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్న వారం తర్వాత, మరణంపై దర్యాప్తులో ఆ వ్యక్తి తన ప్రియురాలితో శృంగారం చేస్తుండగా గుండెపోటు వచ్చి మరణించాడని తేలింది.
Read Also: Job In Cemetery: చదివింది డిగ్రీ.. శ్మశానంలో ఉద్యోగం.. ఎందుకో తెలిస్తే ఔరా! అనాల్సిందే..
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
బెంగళూరులోని జేపీ నగర్ పుట్టెనహళ్లికి చెందిన బాల సుబ్రమణియన్ అనే 67 ఏళ్ల వ్యాపారవేత్తకు తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.. అవకాశం దొరికినప్పుడల్లా వారి మధ్య ఈ వ్యవహారం సాగుతూ వచ్చింది.. అయితే, సదరు వ్యాపారవేత్త నవంబర్ 16న తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.. ఆమెతో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మంచంపైనే కుప్పకూలిపోయాడు.. 16వ తేదీన తన మనవడిని బ్యాడ్మింటన్ కోచింగ్ దగ్గర దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. సాయంత్రం 4.55 గంటల ప్రాంతంలో తన కోడలికి ఫోన్ చేసి తాను ఆలస్యంగా వస్తానని తెలిపాడు. ఆయన చేసిన చివరి ఫోన్ కాల్ అదే.. ఎంతకీ ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో.. అతని కుమారుడు సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఒక రోజు తర్వాత.. ప్లాస్టిక్ కవర్లు మరియు బెడ్షీట్లో ప్యాక్ చేసి అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
అయితే, సదరు వ్యక్తితో తనకు ఉన్న అక్రమ సంబంధం బయటపడితే సమాజంలో తన పరువు పోతుందని భయపడిన మహిళ వెంటనే తన భర్త, సోదరుడికి ఫోన్ చేసింది. మహిళ మరియు ఆమె బంధువులు వ్యాపారవేత్త మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేసి జేపీ నగర్లోని నిర్మూనుష్య ప్రాంతంలో పడేశారు.. ఇక, మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా అనుమానం వచ్చి.. ఆ మహిళను ప్రశ్నించారు.. దీంతో.. ఆ మహిళ అసలు విషయం తెలిపిందే.. భయపడే తన 67 ఏళ్ల ప్రియుడి మృతదేహాన్ని పారవేసినట్లు ఒప్పుకుంది. తానే హత్య చేశానని అంటారేమోనన్న భయంతో భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని పడేసినట్టు వెల్లడించింది.. కాగా, బాల సుబ్రమణ్యం తన ఇంట్లో పనిచేసే సదరు మహిళతోచాలా కాలంగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతను తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని వెల్లడైంది. ఆ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెబుతుంది నిజమేనా? కాదా? అని నిర్ధారించడానికి బాల సుబ్రమణియన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు.
తాజావార్తలు
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..