White Paper on Economy: యూపీఏ వైఫల్యాలపై పార్లమెంట్లో “శ్వేతపత్రం” ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
White Paper on Economy:అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటికే లోక్సభ, రాజ్యసభల్లో ప్రధాని మోడీ కాంగ్రెస్ తీరుపై సంచలన విమర్శలు చేశారు. తాజాగా గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. యూపీఏ ప్రభుత్వం, ఎన్డీయే ప్రభుత్వ పనితీరును పోల్చారు. 2004లో ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా యూపీఏ ప్రభుత్వానికి వచ్చిందని, 2014లో తాము అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన సంక్షోభాలను డాక్యుమెంట్లో ఆమె ప్రస్తావించారు.
Read Also: Amit Shah: కేంద్రం కీలక నిర్ణయం.. మయన్మార్కు రాకపోకలు బంద్
Also Read
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
- Modi-Fadnavis: మోడీతో మరోసారి ఫడ్నవిస్ భేటీ.. కేంద్ర కేబినెట్లోకి వెళ్లనున్నరా?
- Supreme Court: కర్ణాటకకు బిగ్ షాక్.. తమిళనాడుకు కావేరీ జలాలు విడుదలకు ఆదేశం
2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దుర్భలమైన స్థితిలో ఉందని, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, ఆర్థిక దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం ఉందని, ఇది సంక్షోభ పరిస్థితి అని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వేసిన బలమైన ఆర్థిక పునాదులను, సంస్కరణల వేగాన్ని వినియోగించుకోవడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విఫలమైందని, దశాబ్ధ కాలాన్ని ఉపయోగించుకోలేదని ఆరోపించింది. యూపీఏ ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఉందని, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ని చింపివేయడం సిగ్గుచేటని శ్వేతపత్రం ఆరోపించింది.
యూపీఏ అధికారం చేపట్టినప్పుడు భారత్ వృద్ధి రేటు 8 శాతం ఉందని, 1991 ఆర్థిక సంస్కరణల క్రెడిట్ తీసుకోవడంలో విఫలమైన యూపీఏ నాయకత్వం, 2004లో వాటిని పూర్తిగా విడిచిపెట్టిందని శ్వేతపత్రంలో బీజేపీ ఆరోపించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండంకెల ద్రవ్యోల్భణం, ప్రభుత్వ ఆర్థిక నిర్వహాణా లోపాలను, విదేశీ మారకద్రవ్య సంక్షోభాలతో పాటు ఇతర వైఫల్యాలను శ్వేతపత్రం హైలెట్ చేసింది. 2004-2014 మధ్య సగటు వార్షిక ద్రవ్యోల్బణం రేటు దాదాపు 8.2% అని శ్వేతపత్రం పేర్కొంది, అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి UPA ఏమీ చేయలేదని ఆరోపించింది.
యూపీఏ హయాంలో కామన్వెల్త్, 2జీ కుంభకోణాలను కలిగి ఉందని, ఎన్డీయే ప్రభుత్వం 4 జీ ద్వారా ప్రజలు విస్తృత కవరేజీ అందిస్తోందని, జీ20 వంటి సమావేశాలను అత్యుత్తమంగా నిర్వహించినట్లు స్వేతపత్రంలతో పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పింది. ఇండియా వద్ద రికార్డు స్థాయిలో 620 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని తెలిపింది.
తాజావార్తలు
-
Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్తో నిధి అగర్వాల్
-
Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
-
TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!