Online Love: ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని పాకిస్తాన్ వెళ్లిన యూపీ వ్యక్తి.. ఇక్కడే బిగ్ ట్విస్ట్..
- ప్రియురాలి కోసం పాకిస్తాన్ వెళ్లిన యూపీ వ్యక్తి..
- పెళ్లి చేసుకునేందుకు వెళ్లిన బాదల్ బాబు..
- అరెస్ట్ చేసిన పాకిస్తాన్ అధికారులు..
- పెళ్లి చేసుకునే ఆసక్తి లేదన్న ప్రియురాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Love: ఉత్తర్ ప్రదేశ్ అలీఘఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన వార్త వైరల్ అయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా పాకిస్తాన్ సరిహద్దును దాటి దాయాది దేశంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు బాబుని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కి చెందిన సనా రాణి(21)కి బాదల్ బాబులో ఆన్లైన్ స్నేహం కుదిరింది. తన ఫేస్బుక్ ఫ్రెండ్ని కలవడానికి సరిహద్దు దాటి, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని బహౌద్దీన్ జిల్లాలో అరెస్టయ్యాడు. సనాని పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే బాబు సరిహద్దు దాటాడు.
ఇదిలా ఉంటే, బాబుని పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని ప్రియురాలు సనా రాణి పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. ‘‘బాబు, తాను రెండున్నరేళ్లుగా ఫేస్బుక్ స్నేహితులమని, అయితే అతడిని పెళ్లి చేసుకునే ఆసక్తి తనకు లేదని ఆమె పోలీసులకు చెప్పింది’’ అని పంజాబ్ సీనియర్ పోలీస్ అధికారి నసీర్ షా గురువారం చెప్పారు.
Also Read
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
Read Also: Rohit Sharma : ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ ఔట్?
బాబు అక్రమంగా సరిహద్దు దాటి బహౌద్దీన్లోని సనా రాణి ఉంటున్న మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. బాబు రాణిని కలిశారా..? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వలేదు. రాణి పోలీసులు ఒత్తిడికి తలొగ్గి, స్టేట్మెంట్ ఇచ్చిందా.. అనేది ధ్రువీకరించబడలేదు. బాబుతో రాణికి ఉన్న సంబంధాల గురించి ఆమెతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బాబుపై పాకిస్థాన్ ఫారిన్ యాక్ట్ సెక్షన్ 13, 14 కింద కేసులు నమోదు చేశారు.
ఇటీవల కాలంలో సరిహద్దు దాటిన అనేక ప్రేమ వ్యవహరాలు వార్తల్లో అంశాలుగా నిలిచాయి. సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు ఇష్టపడి సరిహద్దులు దాటుతున్నారు. గతంలో అంజు అనే భారతీయ మహిళ, తన ప్రేమికుడిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఆమె ఇస్లాంలోకి మారి నస్రుల్లా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన పాకిస్తానీ మహిళ సీమా హైదర్, తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా ఇండియా వచ్చింది. గతేడాది 19 ఏళ్ల పాకిస్తానీ యువతి ఇక్రా జివానీ 25 ఏళ్ల ములాయం సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇక్రా, ములాయం సింగ్ నేపాల్లో వివాహం చేసుకున్నారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!