Online Love: ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని పాకిస్తాన్ వెళ్లిన యూపీ వ్యక్తి.. ఇక్కడే బిగ్ ట్విస్ట్..
- ప్రియురాలి కోసం పాకిస్తాన్ వెళ్లిన యూపీ వ్యక్తి..
- పెళ్లి చేసుకునేందుకు వెళ్లిన బాదల్ బాబు..
- అరెస్ట్ చేసిన పాకిస్తాన్ అధికారులు..
- పెళ్లి చేసుకునే ఆసక్తి లేదన్న ప్రియురాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Love: ఉత్తర్ ప్రదేశ్ అలీఘఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన వార్త వైరల్ అయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా పాకిస్తాన్ సరిహద్దును దాటి దాయాది దేశంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు బాబుని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కి చెందిన సనా రాణి(21)కి బాదల్ బాబులో ఆన్లైన్ స్నేహం కుదిరింది. తన ఫేస్బుక్ ఫ్రెండ్ని కలవడానికి సరిహద్దు దాటి, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని బహౌద్దీన్ జిల్లాలో అరెస్టయ్యాడు. సనాని పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే బాబు సరిహద్దు దాటాడు.
ఇదిలా ఉంటే, బాబుని పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని ప్రియురాలు సనా రాణి పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. ‘‘బాబు, తాను రెండున్నరేళ్లుగా ఫేస్బుక్ స్నేహితులమని, అయితే అతడిని పెళ్లి చేసుకునే ఆసక్తి తనకు లేదని ఆమె పోలీసులకు చెప్పింది’’ అని పంజాబ్ సీనియర్ పోలీస్ అధికారి నసీర్ షా గురువారం చెప్పారు.
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Read Also: Rohit Sharma : ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ ఔట్?
బాబు అక్రమంగా సరిహద్దు దాటి బహౌద్దీన్లోని సనా రాణి ఉంటున్న మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. బాబు రాణిని కలిశారా..? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వలేదు. రాణి పోలీసులు ఒత్తిడికి తలొగ్గి, స్టేట్మెంట్ ఇచ్చిందా.. అనేది ధ్రువీకరించబడలేదు. బాబుతో రాణికి ఉన్న సంబంధాల గురించి ఆమెతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బాబుపై పాకిస్థాన్ ఫారిన్ యాక్ట్ సెక్షన్ 13, 14 కింద కేసులు నమోదు చేశారు.
ఇటీవల కాలంలో సరిహద్దు దాటిన అనేక ప్రేమ వ్యవహరాలు వార్తల్లో అంశాలుగా నిలిచాయి. సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు ఇష్టపడి సరిహద్దులు దాటుతున్నారు. గతంలో అంజు అనే భారతీయ మహిళ, తన ప్రేమికుడిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఆమె ఇస్లాంలోకి మారి నస్రుల్లా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన పాకిస్తానీ మహిళ సీమా హైదర్, తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా ఇండియా వచ్చింది. గతేడాది 19 ఏళ్ల పాకిస్తానీ యువతి ఇక్రా జివానీ 25 ఏళ్ల ములాయం సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇక్రా, ములాయం సింగ్ నేపాల్లో వివాహం చేసుకున్నారు.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!