India At UN: కాశ్మీర్పై మారని పాకిస్తాన్.. ఘాటుగా స్పందించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India At UN: సమావేశ అజెండాతో సంబంధం లేకుండా దాయాది దేశం పాకిస్తాన్ ప్రవర్తించడం సాధారణంగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై సమావేశం జరిగినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు పాక్ వైఖరిని భారత్ తూర్పారపట్టింది. అయినా కూడా తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఇప్పటికే చాలా సార్లు ఇది తమ అంతర్గత వ్యవహారమని, భారత్ లో జమ్మూ కాశ్మీర్ భాగంగా ఉంది, ఉంటుంది అని భారత్ ఘాటుగానే స్పందిస్తోంది.
తాజాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మరోసారి కాశ్మీర్ రాగాన్ని ఎత్తుకుంది పాకిస్తాన్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి మరియు భద్రతా నిర్వహణ’ పై జరుగుతున్న బహిరంగ చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు. చైనా అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు.
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
Read Also: Apple iPhone 16 : సూపర్ ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. ఆన్లైన్లో లీకైన డేటా ఇదే..
దీనిపై భారత్ గట్టిగానే బదులిచ్చింది. ‘‘ అనవసరమైన, అలవాటైన’’ పద్దతి అని పాకిస్తాన్ వైఖరిని తప్పుపట్టింది. ‘‘ నాదేశంపై వేరే దేశపు ప్రతినిధి చేసిన అనవసరమైన, అలవాటైన వ్యాఖ్యల్ని తోసిపుచ్చడానికి నేను కొన్ని సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోను, నా ప్రతిస్పందనతో వాటిని గౌరవించను’’ అని యూఏన్లో భారతదేశ శాశ్వత మిషన్ కౌన్సెలర్ ఆర్ మధు సూదన్ సోమవారం అన్నారు.
ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం ఎత్తేసింది. అప్పటి నుంచి భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ తో వ్యాపారాన్ని పాక్ బంద్ చేసింది. భారత రాయబారిని బహిష్కరించింది. ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత విషయమని భారత్ అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. ఉగ్రవాదం, హింస లేని పాకిస్తాన్ తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!