UP: విషాదం.. అనారోగ్యంతో భర్త మృతి.. మనో వేదనతో భార్య ఆత్మహత్య
- యూపీలో విషాదం
- అనారోగ్యంతో భర్త మృతి
- మనో వేదనతో భార్య ఆత్మహత్య
- గంటల వ్యవధిలో చనిపోవడంతో షాక్లో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమ్మీద భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఒకరికొకరు తోడుగా కలకాలం జీవించేదే వివాహ బంధం. ప్రియుడి మోజులో పడి భర్తల ప్రాణాలు తీసే ఈరోజుల్లో.. తన భర్త అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ ఇల్లాలు అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
రూపేష్ (35), రీనా (32) భార్యాభర్తలు. మూడేళ్ల క్రితమే వివాహమైంది. ఒక బిడ్డతో కుటుంబం సంతోషంగా సాగిపోతుంది. ఊహించని రీతిలో మృత్యువు ఆ కుటుంబాన్ని కబళించేసింది. రూపేష్ అనారోగ్యంతో గురువారం చనిపోయాడు. దీంతో భార్య, కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు. గురువారం రూపేష్ అంత్యక్రియలు నిర్వహించారు. దు:ఖంలో ఉన్న భార్యను ఇరుగుపొరుగు వారంతా ఓదార్చారు. అయినా కూడా ఆమె దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతే భర్తే లేనప్పుడు తానెందుకు ఈ భూమ్మీద అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం రీనా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇరుగుపొరుగు వారు తలుపు తట్టినా.. ఉలుకు పలుకు లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. రీనా ఆత్మహత్య చేసుకోవడం చూసి షాక్ అయ్యారు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దంపతులిద్దరూ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఏడాది బిడ్డ అనాథయ్యాడు.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
రూపేష్ కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయాడని.. దంపతులిద్దరూ సంతోషంగా ఉంటారని స్థానిక కౌన్సిలర్ రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. భర్త అంత్యక్రియలు పూర్తి చేసి.. ఇంటికి వచ్చిన కొన్ని గంటలకే భార్య చనిపోవడం స్థానికంగా కలిచివేసిందని.. ఇది చాలా దిగ్భ్రాంతికర విషయమని పేర్కొన్నారు. తన భర్త మరణంతో అంతా అయిపోయిందని ఆమె ఏడ్చిందని కౌన్సిలర్ చెప్పారు. ఇరుగుపొరుగు వారు తలుపు తట్టి చూడగా ఆమె పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని తెలిపారు. గురువారం సాయంత్రమే రూపేష్ అంత్యక్రియలు నిర్వహించామని.. శుక్రవారం ఉదయానికి భార్య కూడా చనిపోవడం శోకసంద్రంలో మునిగిపోయామని కౌన్సిలర్ చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Marvel Studios : కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్.. కాంపిటీషన్ ను తట్టుకుంటుందా.?
తాజావార్తలు
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!