UP: విషాదం.. అనారోగ్యంతో భర్త మృతి.. మనో వేదనతో భార్య ఆత్మహత్య
- యూపీలో విషాదం
- అనారోగ్యంతో భర్త మృతి
- మనో వేదనతో భార్య ఆత్మహత్య
- గంటల వ్యవధిలో చనిపోవడంతో షాక్లో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమ్మీద భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఒకరికొకరు తోడుగా కలకాలం జీవించేదే వివాహ బంధం. ప్రియుడి మోజులో పడి భర్తల ప్రాణాలు తీసే ఈరోజుల్లో.. తన భర్త అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ ఇల్లాలు అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
రూపేష్ (35), రీనా (32) భార్యాభర్తలు. మూడేళ్ల క్రితమే వివాహమైంది. ఒక బిడ్డతో కుటుంబం సంతోషంగా సాగిపోతుంది. ఊహించని రీతిలో మృత్యువు ఆ కుటుంబాన్ని కబళించేసింది. రూపేష్ అనారోగ్యంతో గురువారం చనిపోయాడు. దీంతో భార్య, కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు. గురువారం రూపేష్ అంత్యక్రియలు నిర్వహించారు. దు:ఖంలో ఉన్న భార్యను ఇరుగుపొరుగు వారంతా ఓదార్చారు. అయినా కూడా ఆమె దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతే భర్తే లేనప్పుడు తానెందుకు ఈ భూమ్మీద అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం రీనా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇరుగుపొరుగు వారు తలుపు తట్టినా.. ఉలుకు పలుకు లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. రీనా ఆత్మహత్య చేసుకోవడం చూసి షాక్ అయ్యారు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దంపతులిద్దరూ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఏడాది బిడ్డ అనాథయ్యాడు.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
రూపేష్ కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయాడని.. దంపతులిద్దరూ సంతోషంగా ఉంటారని స్థానిక కౌన్సిలర్ రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. భర్త అంత్యక్రియలు పూర్తి చేసి.. ఇంటికి వచ్చిన కొన్ని గంటలకే భార్య చనిపోవడం స్థానికంగా కలిచివేసిందని.. ఇది చాలా దిగ్భ్రాంతికర విషయమని పేర్కొన్నారు. తన భర్త మరణంతో అంతా అయిపోయిందని ఆమె ఏడ్చిందని కౌన్సిలర్ చెప్పారు. ఇరుగుపొరుగు వారు తలుపు తట్టి చూడగా ఆమె పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని తెలిపారు. గురువారం సాయంత్రమే రూపేష్ అంత్యక్రియలు నిర్వహించామని.. శుక్రవారం ఉదయానికి భార్య కూడా చనిపోవడం శోకసంద్రంలో మునిగిపోయామని కౌన్సిలర్ చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Marvel Studios : కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్.. కాంపిటీషన్ ను తట్టుకుంటుందా.?
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!