UP: విషాదం.. అనారోగ్యంతో భర్త మృతి.. మనో వేదనతో భార్య ఆత్మహత్య
- యూపీలో విషాదం
- అనారోగ్యంతో భర్త మృతి
- మనో వేదనతో భార్య ఆత్మహత్య
- గంటల వ్యవధిలో చనిపోవడంతో షాక్లో కుటుంబ సభ్యులు
భూమ్మీద భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఒకరికొకరు తోడుగా కలకాలం జీవించేదే వివాహ బంధం. ప్రియుడి మోజులో పడి భర్తల ప్రాణాలు తీసే ఈరోజుల్లో.. తన భర్త అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ ఇల్లాలు అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
Also Read
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
రూపేష్ (35), రీనా (32) భార్యాభర్తలు. మూడేళ్ల క్రితమే వివాహమైంది. ఒక బిడ్డతో కుటుంబం సంతోషంగా సాగిపోతుంది. ఊహించని రీతిలో మృత్యువు ఆ కుటుంబాన్ని కబళించేసింది. రూపేష్ అనారోగ్యంతో గురువారం చనిపోయాడు. దీంతో భార్య, కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు. గురువారం రూపేష్ అంత్యక్రియలు నిర్వహించారు. దు:ఖంలో ఉన్న భార్యను ఇరుగుపొరుగు వారంతా ఓదార్చారు. అయినా కూడా ఆమె దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతే భర్తే లేనప్పుడు తానెందుకు ఈ భూమ్మీద అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం రీనా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇరుగుపొరుగు వారు తలుపు తట్టినా.. ఉలుకు పలుకు లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. రీనా ఆత్మహత్య చేసుకోవడం చూసి షాక్ అయ్యారు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దంపతులిద్దరూ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఏడాది బిడ్డ అనాథయ్యాడు.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
రూపేష్ కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయాడని.. దంపతులిద్దరూ సంతోషంగా ఉంటారని స్థానిక కౌన్సిలర్ రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. భర్త అంత్యక్రియలు పూర్తి చేసి.. ఇంటికి వచ్చిన కొన్ని గంటలకే భార్య చనిపోవడం స్థానికంగా కలిచివేసిందని.. ఇది చాలా దిగ్భ్రాంతికర విషయమని పేర్కొన్నారు. తన భర్త మరణంతో అంతా అయిపోయిందని ఆమె ఏడ్చిందని కౌన్సిలర్ చెప్పారు. ఇరుగుపొరుగు వారు తలుపు తట్టి చూడగా ఆమె పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని తెలిపారు. గురువారం సాయంత్రమే రూపేష్ అంత్యక్రియలు నిర్వహించామని.. శుక్రవారం ఉదయానికి భార్య కూడా చనిపోవడం శోకసంద్రంలో మునిగిపోయామని కౌన్సిలర్ చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Marvel Studios : కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్.. కాంపిటీషన్ ను తట్టుకుంటుందా.?
తాజావార్తలు
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!