Udhayanidhi Stalin: నేను ‘‘ క్రైస్తవుడిగా గర్విస్తున్నా’’..
- ‘‘నేను క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’..
- ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..
- అన్ని మతాలు తనకు సమానం అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను మతసామరస్యాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. తాను ‘‘క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’ అని ప్రకటించుకుుంటూనే, అన్ని విశ్వాసాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి మాట్లాడుతూ.. విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
‘‘ గత సంవత్సరం ఒక క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో నేను క్రైస్తవుడిని అని గర్వంగా చెప్పాను. ఇది చాలా మంది సంఘీలను చికాకు పెట్టింది. కానీ ఈ రోజు మళ్లీ చెబుతున్నాను, నేను క్రిస్టియన్ అని గర్విస్తున్నాను’’ అని ఉదయనిధి అన్నారు. ‘‘నేను క్రైస్తవుడిని అని మీరు అనుకుంటే, నేను క్రైస్తవుడిని. నేను ముస్లిం అని మీరు అనుకుంటే, నేను ముస్లింనే. నేను హిందువునని మీరు అనుకుంటే, నేను హిందువునే. నేను అందరికీ కామన్. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించమని మాత్రమే బోధిస్తాయి’’ అని ఆయన అన్నారు.
Also Read
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
Read Also: Komatireddy vs Harish Rao: డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాడీవేడి సంభాషణ!
ఇటీవల అలహాబాద్ న్యాయమూర్తి వ్యాఖ్యల్ని ఉదయనిధి ప్రస్తావించారు. ‘‘ఇటీవల ఒక న్యాయమూర్తి మతం పట్ల విద్వేషంతో మాట్లాడటం మనం చూశాం. అలహాబాద్ జడ్జి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తికి న్యాయమూర్తి పదవి ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. అతడి నుంచి న్యాయాన్ని ఎలా ఆశించగలం’’ అని అన్నారు. ఆయనను తొలగించడానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు మద్దతుగా సంతకాలు చేయగా, ఎఐడీఎంకే మద్దతు ఇవ్వలేదని, ఆ పార్టీ బీజేపీ బానిసలా పనిచేస్తుందని దుయ్యబట్టారు.
బీజేపీ-ఏఐడీఎంకే కూటమి రహస్య బంధం కొనసాగుతోందని అన్నారు. ఏఐడీఎంకే రాజ్యాంగ విలువల కన్నా రాజకీయ విధేయతకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. గతేడాది ఉదయనిధి ‘‘సనాతన ధర్మాన్ని’’ డెంగ్యూ, మలేరియాలో పోల్చుతూ, నిర్మూలించాలని వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?