Udhayanidhi Stalin: నేను ‘‘ క్రైస్తవుడిగా గర్విస్తున్నా’’..
- ‘‘నేను క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’..
- ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..
- అన్ని మతాలు తనకు సమానం అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను మతసామరస్యాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. తాను ‘‘క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’ అని ప్రకటించుకుుంటూనే, అన్ని విశ్వాసాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి మాట్లాడుతూ.. విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
‘‘ గత సంవత్సరం ఒక క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో నేను క్రైస్తవుడిని అని గర్వంగా చెప్పాను. ఇది చాలా మంది సంఘీలను చికాకు పెట్టింది. కానీ ఈ రోజు మళ్లీ చెబుతున్నాను, నేను క్రిస్టియన్ అని గర్విస్తున్నాను’’ అని ఉదయనిధి అన్నారు. ‘‘నేను క్రైస్తవుడిని అని మీరు అనుకుంటే, నేను క్రైస్తవుడిని. నేను ముస్లిం అని మీరు అనుకుంటే, నేను ముస్లింనే. నేను హిందువునని మీరు అనుకుంటే, నేను హిందువునే. నేను అందరికీ కామన్. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించమని మాత్రమే బోధిస్తాయి’’ అని ఆయన అన్నారు.
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
Read Also: Komatireddy vs Harish Rao: డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాడీవేడి సంభాషణ!
ఇటీవల అలహాబాద్ న్యాయమూర్తి వ్యాఖ్యల్ని ఉదయనిధి ప్రస్తావించారు. ‘‘ఇటీవల ఒక న్యాయమూర్తి మతం పట్ల విద్వేషంతో మాట్లాడటం మనం చూశాం. అలహాబాద్ జడ్జి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తికి న్యాయమూర్తి పదవి ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. అతడి నుంచి న్యాయాన్ని ఎలా ఆశించగలం’’ అని అన్నారు. ఆయనను తొలగించడానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు మద్దతుగా సంతకాలు చేయగా, ఎఐడీఎంకే మద్దతు ఇవ్వలేదని, ఆ పార్టీ బీజేపీ బానిసలా పనిచేస్తుందని దుయ్యబట్టారు.
బీజేపీ-ఏఐడీఎంకే కూటమి రహస్య బంధం కొనసాగుతోందని అన్నారు. ఏఐడీఎంకే రాజ్యాంగ విలువల కన్నా రాజకీయ విధేయతకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. గతేడాది ఉదయనిధి ‘‘సనాతన ధర్మాన్ని’’ డెంగ్యూ, మలేరియాలో పోల్చుతూ, నిర్మూలించాలని వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!