Udhayanidhi Stalin: నేను ‘‘ క్రైస్తవుడిగా గర్విస్తున్నా’’..
- ‘‘నేను క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’..
- ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..
- అన్ని మతాలు తనకు సమానం అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను మతసామరస్యాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. తాను ‘‘క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’ అని ప్రకటించుకుుంటూనే, అన్ని విశ్వాసాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి మాట్లాడుతూ.. విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
‘‘ గత సంవత్సరం ఒక క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో నేను క్రైస్తవుడిని అని గర్వంగా చెప్పాను. ఇది చాలా మంది సంఘీలను చికాకు పెట్టింది. కానీ ఈ రోజు మళ్లీ చెబుతున్నాను, నేను క్రిస్టియన్ అని గర్విస్తున్నాను’’ అని ఉదయనిధి అన్నారు. ‘‘నేను క్రైస్తవుడిని అని మీరు అనుకుంటే, నేను క్రైస్తవుడిని. నేను ముస్లిం అని మీరు అనుకుంటే, నేను ముస్లింనే. నేను హిందువునని మీరు అనుకుంటే, నేను హిందువునే. నేను అందరికీ కామన్. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించమని మాత్రమే బోధిస్తాయి’’ అని ఆయన అన్నారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Komatireddy vs Harish Rao: డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాడీవేడి సంభాషణ!
ఇటీవల అలహాబాద్ న్యాయమూర్తి వ్యాఖ్యల్ని ఉదయనిధి ప్రస్తావించారు. ‘‘ఇటీవల ఒక న్యాయమూర్తి మతం పట్ల విద్వేషంతో మాట్లాడటం మనం చూశాం. అలహాబాద్ జడ్జి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తికి న్యాయమూర్తి పదవి ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. అతడి నుంచి న్యాయాన్ని ఎలా ఆశించగలం’’ అని అన్నారు. ఆయనను తొలగించడానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు మద్దతుగా సంతకాలు చేయగా, ఎఐడీఎంకే మద్దతు ఇవ్వలేదని, ఆ పార్టీ బీజేపీ బానిసలా పనిచేస్తుందని దుయ్యబట్టారు.
బీజేపీ-ఏఐడీఎంకే కూటమి రహస్య బంధం కొనసాగుతోందని అన్నారు. ఏఐడీఎంకే రాజ్యాంగ విలువల కన్నా రాజకీయ విధేయతకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. గతేడాది ఉదయనిధి ‘‘సనాతన ధర్మాన్ని’’ డెంగ్యూ, మలేరియాలో పోల్చుతూ, నిర్మూలించాలని వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!