Uddhav Thackeray: శివసేన పార్టీ పేరు, గుర్తు స్వాహా.. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఉద్ధవ్ థాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray Goes To Supreme Court After Losing Shiv Sena Name Symbol: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు, గుర్తును కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఉద్ధవ్ థాక్రే వర్గం (యూబీటీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షెడ్యూల్ లేకుండా అత్యవసర విచారణ చేపట్టాలని థాక్రే వర్గం తరఫు న్యాయవాది కోరగా.. అందుకు సుప్రీం అంగీకరించలేదు. సరైన పేపర్ వర్క్తో రేపు అత్యవసర విచారణ జాబితాలో ప్రవేశ పెట్టాలని సూచించారు. దీంతో.. థాక్రే వర్గం ఆ పనిలో నిమగ్నమైంది. కాగా.. శివసేన నుంచి గెలిచిన వారిలో 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది, 18 మంది లోక్సభ సభ్యులలో 13 మంది మద్దతును షిండే వర్గం కలిగి ఉంది. దీంతో.. షిండే వర్గానికి పార్టీ పేరు, గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగిసే వరకు.. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పేరును, జ్వలించే కాగడా చిహ్నాన్ని ఉపయోగించుకోవడానికి థాక్రే వర్గానికి అనుమతి ఇచ్చింది.
Kim Jong-un: కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిక.. 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం
Also Read
ఇదిలావుండగా.. థాక్రే వర్గం శివసేన పేరు, గుర్తుని కోల్పోవడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేయడం వల్లే.. థాక్రే వర్గానికి తగిన శాస్త్రి జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర, అస్సాం మధ్య ‘ఆరవ జ్యోతిర్లింగ భీమాశంకర్’ విషయంలో తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘శివుడు హిమాలయాల్లో నివసిస్తున్నారు. ఆయనను ఫలానా ప్రదేశానికి కుదించడం ఏమాత్రం సబబు కాదు. మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు శివుడి పేరు మీద రాజకీయాలు చేయడం మానేయాలి. శివుడి పేరుపై రాజకీయాలు చేయడం వల్లే.. థాక్రే వర్గం తన పార్టీ పేరుని, చిహ్నాన్ని కోల్పోయింది’’ అని శర్మ అన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?