Uddhav Thackeray: శివసేన పార్టీ పేరు, గుర్తు స్వాహా.. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఉద్ధవ్ థాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray Goes To Supreme Court After Losing Shiv Sena Name Symbol: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు, గుర్తును కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఉద్ధవ్ థాక్రే వర్గం (యూబీటీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షెడ్యూల్ లేకుండా అత్యవసర విచారణ చేపట్టాలని థాక్రే వర్గం తరఫు న్యాయవాది కోరగా.. అందుకు సుప్రీం అంగీకరించలేదు. సరైన పేపర్ వర్క్తో రేపు అత్యవసర విచారణ జాబితాలో ప్రవేశ పెట్టాలని సూచించారు. దీంతో.. థాక్రే వర్గం ఆ పనిలో నిమగ్నమైంది. కాగా.. శివసేన నుంచి గెలిచిన వారిలో 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది, 18 మంది లోక్సభ సభ్యులలో 13 మంది మద్దతును షిండే వర్గం కలిగి ఉంది. దీంతో.. షిండే వర్గానికి పార్టీ పేరు, గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగిసే వరకు.. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పేరును, జ్వలించే కాగడా చిహ్నాన్ని ఉపయోగించుకోవడానికి థాక్రే వర్గానికి అనుమతి ఇచ్చింది.
Kim Jong-un: కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిక.. 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
ఇదిలావుండగా.. థాక్రే వర్గం శివసేన పేరు, గుర్తుని కోల్పోవడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేయడం వల్లే.. థాక్రే వర్గానికి తగిన శాస్త్రి జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర, అస్సాం మధ్య ‘ఆరవ జ్యోతిర్లింగ భీమాశంకర్’ విషయంలో తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘శివుడు హిమాలయాల్లో నివసిస్తున్నారు. ఆయనను ఫలానా ప్రదేశానికి కుదించడం ఏమాత్రం సబబు కాదు. మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు శివుడి పేరు మీద రాజకీయాలు చేయడం మానేయాలి. శివుడి పేరుపై రాజకీయాలు చేయడం వల్లే.. థాక్రే వర్గం తన పార్టీ పేరుని, చిహ్నాన్ని కోల్పోయింది’’ అని శర్మ అన్నారు.
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..