Kim Jong-un: కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిక.. 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea Launches More Missiles: ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచ హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా.. వరుసగా మిస్సైల్స్ ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. శనివారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన కొరియా.. ఇప్పుడు 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. తూర్పు సముద్రం దిశగా ఉత్తర కొరియా మిస్సైల్ను ప్రయోగించిందని దక్షిణకొరియా పేర్కొంది. అటు.. జపాన్ ప్రధాని కార్యాలయం సైతం నార్త్ కొరియా బాలిస్టిక్ మిస్సైల్ను ప్రయోగించిందని ట్వీట్ చేసింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా ఆదివారం ఎయిర్ డ్రిల్స్ నిర్వహించిన నేపథ్యంలో.. ఈ క్షిపణి ప్రయోగాల త్వారా కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిక జారీ చేశారు. అటు.. కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా పసిఫిక్ను తమ ఫైరింగ్ రేంజ్గా మారుస్తామని హెచ్చరించింది. 600ఎంఎం రాకెట్ లాంచర్స్తో రెండు షాట్స్ కాల్చినట్టు నార్త్ కొరియా స్టేట్మెంట్ ఇచ్చింది.
Drive in Theatre: సినిమా ప్రియులకు పండగే.. ఇకపై కార్లలో కూర్చొనే సినిమా చూడొచ్చు
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ఇదిలావుండగా.. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక కసరత్తులపై ఇప్పటికే ఉత్తర కొరియా స్పందించింది. అలాంటి విన్యాసాలు జరిపితే.. తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాము మాటలు చెప్పడమే కాదు, చేతలతో చేసి నిరూపిస్తామంటూ.. ఈ రెండు క్షిపణి ప్రయోగాలు చేసి చూపించింది. తొలుత శనివారం మధ్యాహ్నం జపాన్ పశ్చిమ తీరంలో సముద్రంలోకి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్-15 (ICBM)ను ప్రయోగించింది. ఈ మిస్సైల్ 66 నిమిషాల పాటు ప్రయాణం చేసి, తమ ఎక్స్లూజివ్ ఎకనామిక్ జోన్లో పడిపోయినట్లుగా జపాన్ తెలిపింది. ఆ వెంటనే అమెరికాతో కలిసి దక్షిణ కొరియా ఆదివారం ఉదయం సంయుక్త వైమానిక విన్యాసాలను చేపట్టింది. ఇందులో అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ బాంబర్ విమానాలు పాల్గొన్నాయని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నార్త్ కొరియా.. తన బలం ఏంటో చాటేందుకు 48 గంటల వ్యవధిలోనే సోమవారం నాడు మరో క్షిపణి ప్రయోగం చేసింది.
Sandhya Sreedhar Rao: నేను ఎవరినీ మోసం చేయలేదు.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి
అసలే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక ఉత్తర కొరియా తనని తాను తిరుగులేని అణురాజ్యంగా ప్రకటించుకోవడం, నియంత కిమ్ జోంగ్ ఉన్ ఘాతాంక ఆయుధాల ప్రొడక్షన్ని అమాంతం పెంచేశాక.. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యల్స స్థాయికి దిగజారిపోయాయి. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో.. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్త్ కొరియా ఎప్పుడన్నా దక్షిణ కొరియాపై విరుచుకుపడొచ్చన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!