Kim Jong-un: కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిక.. 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం
North Korea Launches More Missiles: ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచ హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా.. వరుసగా మిస్సైల్స్ ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. శనివారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన కొరియా.. ఇప్పుడు 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. తూర్పు సముద్రం దిశగా ఉత్తర కొరియా మిస్సైల్ను ప్రయోగించిందని దక్షిణకొరియా పేర్కొంది. అటు.. జపాన్ ప్రధాని కార్యాలయం సైతం నార్త్ కొరియా బాలిస్టిక్ మిస్సైల్ను ప్రయోగించిందని ట్వీట్ చేసింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా ఆదివారం ఎయిర్ డ్రిల్స్ నిర్వహించిన నేపథ్యంలో.. ఈ క్షిపణి ప్రయోగాల త్వారా కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిక జారీ చేశారు. అటు.. కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా పసిఫిక్ను తమ ఫైరింగ్ రేంజ్గా మారుస్తామని హెచ్చరించింది. 600ఎంఎం రాకెట్ లాంచర్స్తో రెండు షాట్స్ కాల్చినట్టు నార్త్ కొరియా స్టేట్మెంట్ ఇచ్చింది.
Drive in Theatre: సినిమా ప్రియులకు పండగే.. ఇకపై కార్లలో కూర్చొనే సినిమా చూడొచ్చు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ఇదిలావుండగా.. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక కసరత్తులపై ఇప్పటికే ఉత్తర కొరియా స్పందించింది. అలాంటి విన్యాసాలు జరిపితే.. తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాము మాటలు చెప్పడమే కాదు, చేతలతో చేసి నిరూపిస్తామంటూ.. ఈ రెండు క్షిపణి ప్రయోగాలు చేసి చూపించింది. తొలుత శనివారం మధ్యాహ్నం జపాన్ పశ్చిమ తీరంలో సముద్రంలోకి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్-15 (ICBM)ను ప్రయోగించింది. ఈ మిస్సైల్ 66 నిమిషాల పాటు ప్రయాణం చేసి, తమ ఎక్స్లూజివ్ ఎకనామిక్ జోన్లో పడిపోయినట్లుగా జపాన్ తెలిపింది. ఆ వెంటనే అమెరికాతో కలిసి దక్షిణ కొరియా ఆదివారం ఉదయం సంయుక్త వైమానిక విన్యాసాలను చేపట్టింది. ఇందులో అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ బాంబర్ విమానాలు పాల్గొన్నాయని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నార్త్ కొరియా.. తన బలం ఏంటో చాటేందుకు 48 గంటల వ్యవధిలోనే సోమవారం నాడు మరో క్షిపణి ప్రయోగం చేసింది.
Sandhya Sreedhar Rao: నేను ఎవరినీ మోసం చేయలేదు.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి
అసలే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక ఉత్తర కొరియా తనని తాను తిరుగులేని అణురాజ్యంగా ప్రకటించుకోవడం, నియంత కిమ్ జోంగ్ ఉన్ ఘాతాంక ఆయుధాల ప్రొడక్షన్ని అమాంతం పెంచేశాక.. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యల్స స్థాయికి దిగజారిపోయాయి. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో.. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్త్ కొరియా ఎప్పుడన్నా దక్షిణ కొరియాపై విరుచుకుపడొచ్చన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!