CM MK Stalin: మత ఘర్షణలను పెంచడానికే యూసీసీ తీసుకొస్తున్నారు: తమిళనాడు సీఎం స్టాలిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల్ని ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిర గుణపాఠం చెబుతారని అన్నారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఆ వ్యాఖ్యలపై స్పందించారు.
Read also: Rahul Gandhi: మణిపూర్లో రాహుల్ గాంధీ కాన్వాయ్ను అడ్డగించిన పోలీసులు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. దానిపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ తర్వాత ప్రధాని మోదీ భయపడ్డారని.. అందుకే ఆయన కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడినట్లు స్టాలిన్ తెలిపారు. మాజీ సీఎం కరుణానిధి తనను కేవలం ఓ కుమారుడిలా చూడలేదని, ఆయనకు పార్టీ కార్యకర్తలు అంతా కుమారులే అని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రయోజనాల కోసం యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అంశాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోదీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రధాని ఏకరీతి సివిల్ కోడ్ అమలు చేస్తామని చెప్పారు మరియు మన దేశంలో రెండు చట్టాలు ఉండకూడదని అన్నారు. దీంతో మత ఘర్షణలను పెంచి ప్రజలను గందరగోళానికి గురి చేసి ఎన్నికలల్లో గెలవాలని చూస్తున్నాడని విమర్శించారు. చివరకు ప్రజలు గెలుస్తారని తాను అనుకుంటున్నానని స్టాలిన్ చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read also: గ్లామర్ డోస్ పెంచిన గాలోడు హీరోయిన్
ఒకే విధమైన పౌర చట్టాన్ని సమర్థిస్తున్నందుకు ప్రధాని మోదీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ప్రధానిపై ఫైర్ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్, శివసేన (యుబిటి), ఎఐఎంఐఎం మరియు జెడి(యు) వంటి పార్టీలు ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం వంటి ఒత్తిడితో కూడిన సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి యుసిసి అంశాన్ని ప్రధాని లేవనెత్తారని ఆరోపించిన విషయం తెలిసిందే. భోపాల్లో ర్యాలీ ప్రధాని మాట్లాడుతూ దేశంలో ఒకే వ్యక్తుల కోసం వేర్వేరు చట్టాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ యూసీసీ అమలును సమర్థించిన విషయం తెలిసిందే. వివిధ చట్టాలతో దేశం ఎలా నడుస్తుంది? యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. రెండు రకాల చట్టాలు దేశాన్ని నడపలేవు. భారత రాజ్యాంగం కూడా పౌరులకు సమాన హక్కుల గురించి మాట్లాడుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!