Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం.. ఆ దేశానికి ఎందుకు సాయం చేయాలంటూ ట్రంప్ ఫైర్..
- భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం..
- ఆ దేశానికి ఎందుకు సాయం చేయాలంటూ ట్రంప్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా నిధులను ఉపయోగించారని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) అందించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేశాయి. యూఎస్ఎయిడ్ నిధుల్ని కాంగ్రెస్, దాని ఎకోసిస్టమ్ వాడుకుందని బీజేపీ కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించింది.
ఇదిలా ఉంటే, మరోసారి డొనాల్డ్ ట్రంప్ భారతదేశం, అమెరికా నిధులపై వ్యాఖ్యలు చేశారు. అమెరికా వస్తువులపై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఆ దేశం ఇప్పటికే ప్రయోజనం పొందుతోందని ఆరోపిస్తూ, అమెరికా భారతదేశానికి ఎందుకు సాయం అందిస్తోందని ట్రంప్ పశ్నించారు. ‘‘భారత ఎన్నికల్లో సాయం చేయడానికి 18 మిలియన్ డాలర్లు, ఎందుకీ నరకం..? మేము ఎన్నికల కోసం భారతదేశానికి డబ్బు ఇస్తున్నాము, వారికి డబ్బు అవసరం లేదు’’ అని ట్రంప్ ఈ రోజు వాషింగ్టన్లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్(CPAC)లో ప్రసంగిస్తూ అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Yogi Adityanath: కుంభమేళాకి 62 కోట్ల మంది భక్తులు..ఈ శతాబ్ధంలోనే అరుదైన సంఘటన..
‘‘వారు మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో అది ఒకటి. మేము ఏదో ఒకటి అమ్మడానికి ప్రయత్నిస్తాము, వారు 200 శాతం సుంకాలు విధిస్తారు. ఆపై వారికి ఎన్నికల్లో సహాయం చేయడానికి మేము వారికి డబ్బు ఇస్తున్నాము’’ అని ట్రంప్ అన్నారు.
అయితే, ఈ 21 మిలియన్ డాలర్ల అమెరికా నిధులు భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ ఉపయోగించిందని బీజేపీ ఆరోపించింది. అయితే, ఈ నిధులు బంగ్లాదేశ్కి కేటాయించినట్లు చెబుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్, వాషింగ్టన్ పోస్ట్ కథనాలను ప్రచురించాయి. దీంతో బీజేపీపై కాంగ్రెస్ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. కాషాయ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!