Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం.. ఆ దేశానికి ఎందుకు సాయం చేయాలంటూ ట్రంప్ ఫైర్..
- భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం..
- ఆ దేశానికి ఎందుకు సాయం చేయాలంటూ ట్రంప్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా నిధులను ఉపయోగించారని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) అందించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేశాయి. యూఎస్ఎయిడ్ నిధుల్ని కాంగ్రెస్, దాని ఎకోసిస్టమ్ వాడుకుందని బీజేపీ కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించింది.
ఇదిలా ఉంటే, మరోసారి డొనాల్డ్ ట్రంప్ భారతదేశం, అమెరికా నిధులపై వ్యాఖ్యలు చేశారు. అమెరికా వస్తువులపై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఆ దేశం ఇప్పటికే ప్రయోజనం పొందుతోందని ఆరోపిస్తూ, అమెరికా భారతదేశానికి ఎందుకు సాయం అందిస్తోందని ట్రంప్ పశ్నించారు. ‘‘భారత ఎన్నికల్లో సాయం చేయడానికి 18 మిలియన్ డాలర్లు, ఎందుకీ నరకం..? మేము ఎన్నికల కోసం భారతదేశానికి డబ్బు ఇస్తున్నాము, వారికి డబ్బు అవసరం లేదు’’ అని ట్రంప్ ఈ రోజు వాషింగ్టన్లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్(CPAC)లో ప్రసంగిస్తూ అన్నారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Read Also: Yogi Adityanath: కుంభమేళాకి 62 కోట్ల మంది భక్తులు..ఈ శతాబ్ధంలోనే అరుదైన సంఘటన..
‘‘వారు మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో అది ఒకటి. మేము ఏదో ఒకటి అమ్మడానికి ప్రయత్నిస్తాము, వారు 200 శాతం సుంకాలు విధిస్తారు. ఆపై వారికి ఎన్నికల్లో సహాయం చేయడానికి మేము వారికి డబ్బు ఇస్తున్నాము’’ అని ట్రంప్ అన్నారు.
అయితే, ఈ 21 మిలియన్ డాలర్ల అమెరికా నిధులు భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ ఉపయోగించిందని బీజేపీ ఆరోపించింది. అయితే, ఈ నిధులు బంగ్లాదేశ్కి కేటాయించినట్లు చెబుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్, వాషింగ్టన్ పోస్ట్ కథనాలను ప్రచురించాయి. దీంతో బీజేపీపై కాంగ్రెస్ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. కాషాయ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!