Giorgia Meloni: నేను, మోడీ, ట్రంప్ మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పా.? వామపక్షాలపై మెలోనీ తీవ్ర ఆగ్రహం..
- ట్రంప్, మోడీ మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పా..?
- లెఫ్ట్ లిబరల్స్పై విరుచుకుపడిన జార్జియా మెలోనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giorgia Meloni: ప్రపంచ వామపక్ష రాజకీయ నాయకులపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి నాయకులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ వంటి కొత్త ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని, నాయకత్వం వహిస్తున్నారని ఆమె అన్నారు. ఈ జాతీయ నాయకులు జాతీయ ప్రయోజనాల గురించి, వారి దేశ సరిహద్దులను రక్షించుకోవడం గురించి మాట్లాడితే కొందరు దీనిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా పిలుస్తున్నారని అన్నారు. జాతీయవాద నాయకులపై వామపక్ష నాయకులు తరుచుగా చేసే విమర్శలను ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మెలోని చెప్పారు.
Read Also: Teacher Harassment: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి..
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
జాతీయవాద నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, దీంతో లెఫ్ట్ లిబరల్స్ ఆందోళన చెందుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ‘‘90లో బిల్ క్లింటన్(అమెరికా ప్రెసిడెంట్), టోనీ బ్లేయర్(యూకే పీఎం) ప్రపంచ వామపక్ష ఉదారవాద నెట్వర్క్ను సృష్టించినప్పుడు, వారిని రాజనీతిజ్ఞులు అని పిలిచేవారు. నేడు, ట్రంప్, మెలోని, మిలీ లేదా బహుశా మోడీ మాట్లాడినప్పుడు, వారిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇది వామపక్షాల ద్వంద్వ ప్రమాణాలు’’ అని ఆదివారం వాషింగ్టన్ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్లో వర్చువల్గా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూరప్లోని ఇతర దేశాలతో పాటు ఇటలీలో అక్రమ వలసదారుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, మెలోనీ తరుచుగా తన ఆందోళనల్ని వ్యక్తం చేస్తోంది. ఈ వలసల ముప్పుని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వామపక్ష ఉదారవాదులు మోడీ, ట్రంప్ లాంటి నాయకులపై ఎంత బురద జల్లినా కూడా ప్రజలు వారికే ఓటు వేస్తున్నారని మెలోనీ చెప్పారు. మేము స్వేచ్ఛని కాపాడుకుంటామని, మా దేశాన్ని ప్రేమిస్తామని, సురక్షితమైన సరిహద్దుల్ని కోరుకుంటున్నామని మెలోనీ అన్నారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!