Giorgia Meloni: నేను, మోడీ, ట్రంప్ మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పా.? వామపక్షాలపై మెలోనీ తీవ్ర ఆగ్రహం..
- ట్రంప్, మోడీ మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పా..?
- లెఫ్ట్ లిబరల్స్పై విరుచుకుపడిన జార్జియా మెలోనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giorgia Meloni: ప్రపంచ వామపక్ష రాజకీయ నాయకులపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి నాయకులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ వంటి కొత్త ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని, నాయకత్వం వహిస్తున్నారని ఆమె అన్నారు. ఈ జాతీయ నాయకులు జాతీయ ప్రయోజనాల గురించి, వారి దేశ సరిహద్దులను రక్షించుకోవడం గురించి మాట్లాడితే కొందరు దీనిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా పిలుస్తున్నారని అన్నారు. జాతీయవాద నాయకులపై వామపక్ష నాయకులు తరుచుగా చేసే విమర్శలను ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మెలోని చెప్పారు.
Read Also: Teacher Harassment: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
జాతీయవాద నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, దీంతో లెఫ్ట్ లిబరల్స్ ఆందోళన చెందుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ‘‘90లో బిల్ క్లింటన్(అమెరికా ప్రెసిడెంట్), టోనీ బ్లేయర్(యూకే పీఎం) ప్రపంచ వామపక్ష ఉదారవాద నెట్వర్క్ను సృష్టించినప్పుడు, వారిని రాజనీతిజ్ఞులు అని పిలిచేవారు. నేడు, ట్రంప్, మెలోని, మిలీ లేదా బహుశా మోడీ మాట్లాడినప్పుడు, వారిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇది వామపక్షాల ద్వంద్వ ప్రమాణాలు’’ అని ఆదివారం వాషింగ్టన్ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్లో వర్చువల్గా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూరప్లోని ఇతర దేశాలతో పాటు ఇటలీలో అక్రమ వలసదారుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, మెలోనీ తరుచుగా తన ఆందోళనల్ని వ్యక్తం చేస్తోంది. ఈ వలసల ముప్పుని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వామపక్ష ఉదారవాదులు మోడీ, ట్రంప్ లాంటి నాయకులపై ఎంత బురద జల్లినా కూడా ప్రజలు వారికే ఓటు వేస్తున్నారని మెలోనీ చెప్పారు. మేము స్వేచ్ఛని కాపాడుకుంటామని, మా దేశాన్ని ప్రేమిస్తామని, సురక్షితమైన సరిహద్దుల్ని కోరుకుంటున్నామని మెలోనీ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!