Delhi Elections: 2015, 2020లో బీజేపీ గ్రాఫ్ ఇది.. 2025 బిగ్ ఛేంజ్ అవుతుందా?
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2015, 2020లో బీజేపీ గ్రాఫ్ ఇది
- 2025 బిగ్ ఛేంజ్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆప్ మాత్రం అవి ఫేక్ సర్వేలంటూ తోసిపుచ్చుతోంది. ఇలా ఎవరికి వారే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఊహాగానాలన్నింటికీ మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
ఇది కూడా చదవండి: Sharad Pawar : 20ఏళ్ల తర్వాత బీహార్ లోకి ఎంట్రీ ఇస్తున్న శరద్ పవార్
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఇదిలా ఉంటే 2015, 2020 ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గానీ.. బీజేపీ గానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కాంగ్రెస్ అయితే జీరో సీట్లు సాధించింది. బీజేపీ అయితే కనీసం కొన్ని సీట్లైనా గెలిచింది. 2015లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 సీట్లలో 62 గెలుచుకుని ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుని తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ ఏర్పాటు చేసింది. బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు.
అయితే ఈసారి జరిగిన ఎన్నికలు అందుకు భిన్నమని బీజేపీ వాదిస్తోంది. కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమలం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనికి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా కమలానికే జై కొట్టాయి. కనీసం 55 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. రెండో స్థానంలో ఆప్ ఉండబోతుందని పేర్కొన్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పాయి. అంతేకాకుండా ఆప్ ప్రకటించినట్లుగానే.. బీజేపీ కూడా ఉచిత హామీలు ప్రకటించింది. దీంతో ఓటర్లంతా కమలం వైపు చూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా శనివారం బీజేపీ గెలుస్తుందా? లేదంటే ఆప్ గెలుస్తుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: AP Budget Session: కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ.. తర్వాతే బడ్జెట్ సమావేశాలు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..