AP Budget Session: కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ.. తర్వాతే బడ్జెట్ సమావేశాలు..
- ఈ నెల 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..
- కావాల్సిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు..
- 20 రోజులు పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తోన్న ప్రభుత్వం..
- ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు కొత్త సభ్యులకు శిక్షణ..
AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.. అసెంబ్లీ సమావేశాలకు కావాల్సిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది.. అసెంబ్లీ సమావేశాలను 20 రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.. అయితే, అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే బీఏసీ సమావేశం నిర్వహించి దానిలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.. సభలో చర్చించాల్సిన అజెండాలకు కూడా ఫైనల్ చేయనున్నారు.. ఇప్పటికే ఆర్ధిక శాఖ అధికారులు 2025 – 26 ఆర్ధిక బడ్జెట్ కేటాయింపులకు సంబందిచిన అవసరాల మేరకు కేటాయింపులపై చర్చించారు.. ఇప్పటికే కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో.. ఏపీ బడ్జెట్ లో కేటాయింపులపై స్పష్టత వచ్చింది.. ఈ బడ్జెట్ లో మూడు కీలకమైన సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయింపులతో పాటు.. సంక్షేమం – అభివృద్దికి సమప్రాధన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది..
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
ఈ నెల 28వ తేదీన లేదా వచ్చే నెల 3వ తేదీన ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.. 26న శివరాత్రి.. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో 28న బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. ఇదే క్రమంలో ఈ సారి అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండటంతో.. కొత్తగా ఎంపికైన శాసన సభ్యులకు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అవగాహన తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యులు విధులు, సభలో సభ్యుల నడుచుకునే తీరు వంటి అంశాలపై సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు.. ఈ శిక్షణా తరగతులను ప్రారంభించేలా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ను ముఖ్య అతిధిగా అహ్వానించనున్నారు అసెంబ్లీ స్పీకర్.. రెండో రోజు మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు కూడా ఈ శిక్షణా తరగతులకు హాజరుకానున్నారు..
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?