Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన ‘ప్రగతి’ సమీక్షా సమావేశంలో సైబర్ నేరాల నియంత్రణ, పనితీరులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సైబర్ భద్రతకు సంబంధించిన 9 కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ అంశాలు ఏవంటే.. రాష్ట్ర సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం(S4C) ఏర్పాటు, ఈ-జీరో ఎఫ్.ఐ.ఆర్ అమలు, ఫిర్యాదుల పరిష్కార విభాగం, డబ్బును రీఫండ్ చేసే మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM), హానికర కంటెంట్ తొలగించే ‘సహాయోగ్’ పోర్టల్, ‘సమన్వయ’ పోర్టల్ వినియోగం, సైబర్ హాట్స్పాట్ల గుర్తింపు, అధికారుల శిక్షణ అండ్ ప్రజలకు అవగాహన కల్పించడం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐ4సి (I4C) అభివృద్ధి చేసిన పోర్టళ్లను సమర్థవంతంగా వాడినందుకు తెలంగాణను ప్రత్యేకంగా అభినందించారు.
పౌరుల సౌకర్యార్థం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ 8712665600 ను ఏర్పాటు చేసింది. బ్యాంకు ఖాతాల ఫ్రీజ్/అన్ఫ్రీజ్ సమస్యల పరిష్కారానికి ఇది పనిచేస్తుంది. ఆగస్టు 2, 2026 నాటికి వచ్చిన 2,368 దరఖాస్తుల్లో 2,086 (88%) పరిష్కారమయ్యాయి. మనీ రెస్టోరేషన్ లో భాగంగా.. బాధితులకు డబ్బు వేగంగా ఇచ్చేందుకు ఇది తోడ్పడుతుంది. ఎఫ్.ఐ.ఆర్ లేదా కోర్టు ఉత్తర్వులు లేకపోయినా రూ.50,000 వరకు నేరుగా రిఫండ్ పొందవచ్చు. రూ.50,000 దాటితే కోర్టు ఆదేశాలు అవసరం. తెలంగాణలో రూ.16.42 కోట్ల రికవరీకి సంబంధించి 34,524 కేసులు నమోదు కాగా, 28,097 కేసుల్లో (81.38%) చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Also Read
సహాయోగ్ పోర్టల్ లో భాగంగా.. సోషల్ మీడియాలోని అనవసర, ప్రమాదకర లింకులను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. తెలంగాణలో నమోదైన 22,447 యు.ఆర్.ఎల్లలో 20,070 (89.41%) తొలగించారు. సమన్వయ పోర్టల్ అనేది దేశవ్యాప్తంగా పోలీసుల మధ్య సమాచారాన్ని పంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 6,721 విజ్ఞప్తులలో 6,518 (96.68%) పూర్తి చేశారు. అలాగే తెలంగాణ నుండి పంపిన 7,018 విజ్ఞప్తులలో 5,560 (79.22%) పూర్తయ్యాయి. ఈ పోర్టల్ ద్వారా 3,524 కేసులు అప్లోడ్ చేసి, 5,493 మంది నిందితుల ప్రొఫైల్స్ 14,964 అంతర్రాష్ట్ర లింకులను కనుగొన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ (ఐ.పి.ఎస్) ఈ విజయానికి సంతోషం వ్యక్తం చేశారు. సైబర్ మోసానికి గురైతే పౌరులు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా హెల్ప్లైన్ 8712665600 ను సంప్రదించాలని కోరారు.
రాష్ట్రాల ర్యాంకింగ్ జాబితా (జనవరి 1, 2026 నుంచి జులై 31 వరకు) ఇలా..
1.తెలంగాణ, 2. మహారాష్ట్ర, 3. పుదుచ్చేరి, 4. లడఖ్, 5. ఉత్తరాఖండ్, 6. ఢిల్లీ, 7. హర్యానా, 8. దాద్రా నాగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు, 9. గుజరాత్, 10. హిమాచల్ ప్రదేశ్, 11. త్రిపుర, 12. బీహార్, 13. చండీగఢ్, 14. ఆంధ్రప్రదేశ్, 15. అరుణాచల్ ప్రదేశ్, 16. అండమాన్ అండ్ నికోబార్, 17. పంజాబ్, 18. గోవా. అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..