YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSP MPs Meet Amit Shah: న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం కలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా జిల్లాల పర్యటనల సమయంలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని, ఇటీవల దేవరపల్లి పర్యటనలో భారీగా ప్రజలు హాజరైనప్పటికీ సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని వివరించింది.
గత రెండేళ్లుగా వైఎస్ జగన్ నిర్వహిస్తున్న పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఎంపీలు ఆరోపించారు. జగన్కు పటిష్టమైన భద్రత కల్పించేలా కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు.
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
భద్రత అంశంతో పాటు డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని కూడా ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుల వివరాలను కూడా కేంద్ర హోంమంత్రికి వివరించారు.
గత రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్ మరణాలు చోటుచేసుకున్నాయని, ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు. భారతి సిమెంట్స్ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని సంస్థ కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తూ, ప్రజాస్వామ్య హక్కులు, న్యాయపాలన, ప్రజల భద్రత పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!