Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raksha Bandhan 2026: తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాస పౌర్ణమి రోజున ఘనంగా జరుపుకుంటారు. 2026లో ఈ పండుగ మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే రక్షాబంధన్ రోజున చంద్రగ్రహణం సంభవించనుండటంతో పాటు, పండుగ తేదీ, శుభ ముహూర్తంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే, హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ పౌర్ణమి తిథి 2026 ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28వ తేదీ ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ఆగస్టు 28న ఉండటంతో రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28, 2026న నిర్వహిస్తారు.
రాఖీ కట్టేందుకు ఆగస్టు 28న ఉదయం 5:57 గంటల నుంచి 9:48 గంటల వరకు అత్యంత శుభ సమయంగా భావిస్తున్నారు. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే భద్ర కాలం ముగియడం వల్ల పండుగ ఆచారాలను రోజు ప్రారంభం నుంచే ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించవచ్చు. ఈ రోజున ఇతర ముఖ్యమైన శుభ ముహూర్తాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:28 నుంచి 5:12 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు, అమృత్ కాల్ ఉదయం 7:44 నుంచి 9:23 వరకు ఉంటుంది. ఈ సమయాల్లో కూడా పూజలు, శుభకార్యాలు నిర్వహించవచ్చు.
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ఇదిలా ఉండగా, ఆగస్టు 28న ఉదయం 6:55 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల సూతక కాలం వర్తించదు. దీంతో రక్షాబంధన్ పండుగ ఆచారాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని పండితులు పేర్కొంటున్నారు. అందువల్ల సోదరీమణులు ఎలాంటి సందేహం లేకుండా నిర్ణీత శుభ ముహూర్తంలో తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తూ ఈ పవిత్ర పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు.
తాజావార్తలు
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!