Tamil Nadu: తమిళనాడులోకి సీబీఐకి నో పర్మిషన్.. సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం..
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సీఎం స్టాలిన్ క్యాబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార డీఎంకే పార్టీ ఈడీ రైడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు పలుకుతున్నాయి.
Read Also: YouTube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్న్యూస్.. ఇకపై 500 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా చాలు..
Also Read
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇదిలా ఉంటే మంత్రి వి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి తమిళనాడులోకి నో పర్మిషన్ అని చెప్పారు. సీబీఐకి ఇచ్చే సాధారణ సమ్మతిని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మనీలాండరింగ్ కేసులో డిఎంకె మంత్రి వి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత డిఎంకె ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలాజీ ఇళ్లు, కార్యాలయంలో ఈడీ సోదాలు చేయడంపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐకి అనుమతి నిరాకరించిన బీజేపేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా చేరింది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ , పశ్చిమ బెంగాల్ సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుని సీబీఐకి నో పర్మిషన్ చెప్పాయి. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946, సీబీఐ విచారణ చేయాలంటే రాష్ట్రాల ముందుస్తు అనుమతి తప్పనిసరి చేసినప్పటికీ.. 1989 మరియు 1992లో కొన్ని కేటగిరీల కేసులకు కొన్ని మినహాయింపులు ఇవ్వబడ్డాయి. అయితే ఈడీ, ఎన్ఐఏ దర్యాప్తులపై ఇది ప్రభావం చూపదు.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!