Tamil Nadu: తమిళనాడులోకి సీబీఐకి నో పర్మిషన్.. సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సీఎం స్టాలిన్ క్యాబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార డీఎంకే పార్టీ ఈడీ రైడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు పలుకుతున్నాయి.
Read Also: YouTube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్న్యూస్.. ఇకపై 500 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా చాలు..
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
ఇదిలా ఉంటే మంత్రి వి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి తమిళనాడులోకి నో పర్మిషన్ అని చెప్పారు. సీబీఐకి ఇచ్చే సాధారణ సమ్మతిని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మనీలాండరింగ్ కేసులో డిఎంకె మంత్రి వి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత డిఎంకె ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలాజీ ఇళ్లు, కార్యాలయంలో ఈడీ సోదాలు చేయడంపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐకి అనుమతి నిరాకరించిన బీజేపేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా చేరింది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ , పశ్చిమ బెంగాల్ సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుని సీబీఐకి నో పర్మిషన్ చెప్పాయి. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946, సీబీఐ విచారణ చేయాలంటే రాష్ట్రాల ముందుస్తు అనుమతి తప్పనిసరి చేసినప్పటికీ.. 1989 మరియు 1992లో కొన్ని కేటగిరీల కేసులకు కొన్ని మినహాయింపులు ఇవ్వబడ్డాయి. అయితే ఈడీ, ఎన్ఐఏ దర్యాప్తులపై ఇది ప్రభావం చూపదు.
తాజావార్తలు
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!