Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tamil Nadu Cm And Kerala Cm Letter To Pm Modi Over Ias Cadre Rules

ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చొద్దు.. కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి

Published Date :January 23, 2022 , 7:51 pm
By Sudhakar Ravula
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చొద్దు.. కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వం.. కొన్ని స‌వ‌ర‌ణ‌ల‌ను ప్ర‌తిపాదించింది.. కానీ, అప్పుడే రాష్ట్రాలు.. కేంద్రం తీరును వ్య‌తిరేకిస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో మ‌రో రెండు రాష్ట్రాలు చేరాయి.. ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖలు రాశారు తమిళనాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్, కేర‌ళ సీఎం పిన‌రాయి విజ‌య‌న్‌.. కేంద్రం ప్రతిపాదనలపై త‌మ‌ లేఖ‌లో ఇద్ద‌రు సీఎంలు అభ్యంత‌రాలు వ్యక్తం చేశారు. కాగా, ఇప్ప‌టికే కేంద్రం ప్ర‌తిపాద‌న‌ల‌ను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంల‌ను వ్య‌తిరేకిస్తున్నారు.. వారు ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ‌లు రాశారు.. ఇక‌, ఇవాళ పీఎంకు త‌మిళ‌నాడు సీఎంతో పాటు కేర‌ళ ముఖ్య‌మంత్రి కూడా లేఖలు రాశారు..

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు ఎంకే స్టాలిన్.. తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాన‌ని.. ఐఏఎస్ క్యాడర్ రూల్స్, 1954ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై త‌న లేఖ‌లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.. ఈ ప్రతిపాదనలు భారత దేశ సమాఖ్య పునాదులను బలంగా కుదిపేస్తాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన స్టాలిన్.. అందువల్ల వీటిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రోవైపు.. ఐఏఎస్ కేడర్ నిబంధనలకు కేంద్రం ప్రతిపాదించిన సవరణను ఉపసంహరించుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని మోడీకి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను సహకార సమాఖ్య వ్యవస్థ యొక్క మూలాన్ని బలహీనప‌రుస్తాయ‌న్నారు.

Also Read

  • West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
  • Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
  • Boat sink: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
  • Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...

అయితే రాష్ట్రాల ఆందోళ‌న‌కు కొన్ని కార‌ణాలు ఉన్నాయి.. కేంద్రం కొత్త‌ నిబంధనలను తీసుకొస్తే రాష్ట్రాల పరిపాలన చిక్కుల్లో ప‌డుతుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.. ముఖ్యంగా నాలుగు సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.. వాటిని ప‌రిశీలిస్తే.. స్టేట్ క్యాడర్ ఆఫీసర్‌ను కేంద్రానికి నిర్దేశిత సమయంలోగా పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసినట్లయితే, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి క్యాడర్ నుంచి ఆ అధికారి రిలీవ్ అవుతారు అనేది ఒక‌టి రాగా.. కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్‌పై వాస్తవంగా ఎంత మంది అధికారులను పంపించాలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, అటువంటి అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాల‌న్న‌ది రెండో పాయింట్.. ఇక‌. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదరకపోతే, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట గడువులోగా అమలు చేయాల‌న్న‌ది మూడో అంశం కాగా.. నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి క్యాడర్ ఆఫీసర్ల సేవలు అవసరమైనపుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిర్దిష్ట గడువులోగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుంది. వీటిపైనే బీజేపీయేత‌ర రాష్ట్రాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM MK Stalin
  • CM Pinarayi Vijayan
  • IAS Cadre Rules
  • Kerala
  • PM Modi

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions