MK.Stalin: ఎంపీ స్థానాలు పెరగాలంటే త్వరత్వరగా పిల్లల్ని కనండి.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
- ఎంపీ స్థానాలు పెరగాలంటే త్వరత్వరగా పిల్లల్ని కనండి
- పెళైన కొత్త జంటలకు సీఎం స్టాలిన్ కీలక సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పార్లమెంట్ స్థానాలు పెరగాలంటే.. పెళ్లైన జంటలు త్వరత్వరగా పిల్లల్ని కనాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. త్వరలో కేంద్రం.. డీలిమిటేషన్ చేయబోతుంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలు పెరుగుతాయని సూచించింది. అయితే కేంద్ర ప్రకటనపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లోక్సభ స్థానాలు పెరగాలంటే.. వెంటవెంటనే పిల్లల్ని కనడమే మార్గమని దంపతులకు సూచించారు.
ఇది కూడా చదవండి: Venkaiah Naidu : హీరోల పాత్రల తీరుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
గతంలో తానే నిదానంగా పిల్లల్ని కనండని చెప్పిన మాట వాస్తవమే.. కానీ ఇప్పుడు అలా చెప్పకూడదన్నారు. ఎంత జనాభా ఉంటే.. అన్ని ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితి వచ్చిందని తెలిపారు. గతంలో కుటుంబ నియంత్రణ సక్సెస్ ఫుల్గా అమలు చేశాం.. అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఓపిగ్గా కనండి.. వెంటవెంటనే కనాలని సూచించారు. తమిళ హక్కులను తగ్గించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు. మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని.. ఎన్నికల సంఘంలో నమోదైన 45 పార్టీలను ఆహ్వానించినట్లు చెప్పారు. మరికొందరు అఖిలపక్ష సమావేశానికి రావడం లేదని చెబుతున్నారని.. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ డీఎంకే వ్యక్తిగత సమస్య కాదని చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడాన్ని రాజకీయంగా చూడొద్దని.. అందరూ కలిసి రావాలని పార్టీలను స్టాలిన్ కోరారు.
ఇది కూడా చదవండి: Dulquer Salmaan : లాంగ్ గ్యాప్ తర్వాత మలయాళంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్చేస్తే ఏపీ, తెలంగాణలో 3 చొప్పునే సీట్లు పెరగనున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ సీట్లుండగా 20 వరకు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 ఉండగా 28కి పెరుగుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా రెండు పెరిగి 41కి చేరుకుంటాయి. యూపీ, బిహార్లో మాత్రం భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉండగా.. 128కి పెరిగే అవకాశం. బీహార్లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44కి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్నాటకలో 28 స్థానాలుండగా.. 36కి పెరుగుతాయి.
ఇది కూడా చదవండి: AP Assembly Budget Sessions: గంజాయి సాగును పూర్తి స్థాయిలో అరికడతాం!
- Tags
- bjp
- congress
- DMK
- Key advice
- newlyweds
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!