India – Bangladesh: క్రమపద్ధతిలో హిందువుల, హిందూ ఆలయాలపై దాడులు.. బంగ్లాదేశ్ తీరుపై భారత్ ఆగ్రహం..
- బంగ్లాదేశ్లో రెచ్చిపోతున్న ఇస్లామిస్ట్ శక్తులు..
- దుర్గాపూజ మండపాలపై దాడులు..
- ప్రధాని బహూకరించిన కిరీటం చోరీ..
- ఢాకాలోని జెషోశ్వరీ ఆలయంపై బాంబు దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – Bangladesh: బంగ్లాదేశ్లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. హిందువులు, మైనారిటీలే లక్ష్యంగా రాడికల్ ముస్లింగుంపు దాడులకు తెగబడుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా దిగిపోయి, మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోయింది. సత్ఖిరాలోని జోషోశ్వరి ఆలయంలో ఉన్న హిందూదేవత వెంటి, బంగారు విగ్రహాం చోరీకి గురైంది. 2021లో ప్రధానిమోడీ బంగ్లాదేశ్ పర్యటనలో దీనిని బహూకరించారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో దుర్గాపూజ మండపాల వద్ద దాడులు జరిగాయి.
బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఢాకాలోని ఢాకాలోని తాంతిబజార్లోని పూజా మండపంపై దాడి, సత్ఖిరాలోని పూజ్యమైన జెషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీని మేము తీవ్ర ఆందోళనతో గుర్తించాము. ఇవి శోచనీయమైన సంఘటనలు. అవి క్రమబద్ధమైన పద్ధతిన చాలా రోజులుగా హిందూ ఆలయాలు, దేవతలను అపవిత్రం చేస్తున్నారు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Bangladesh: బంగ్లాదేశ్లో మోడీ దుర్గామాతకు బహూకరించిన కిరీటం చోరీ.. భారత్ సీరియస్
పండగ సమయంలో హిందువులు, మైనారిటీలకు వారి ప్రార్థనా స్థలాలకు భద్రతను పెంచాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారతదేశంతో పాటు పొరుగుదేశాల్లో విస్తరించి ఉన్న 51 శక్తి పీఠాల్లో జెషోశ్వరి ఆలయం ఒకటిగా పరిగణించబడుతుంది. శుక్రవారం ఢాకాలోని తాంతిబజార్ ప్రాంతంలో దుర్గాపూజా మండపంపై పెట్రోల్ బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో కనీసం 20 మంది గాయపడ్డారు.
17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8 శాతం ఉన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆగస్టులో జరిగిన హింసాత్మక నిరసనల తర్వాత బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి హిందూ సమాజం బెదిరింపులను ఎదుర్కొంటోంది. మెజారిటీ ముస్లింల మనోభావాలను విరుద్ధంగా దుర్గాపూజను హిందువులు నిర్వహించొద్దని అక్కడి ఇస్లామిస్ట్ గ్రూపులు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి దుర్గాపూజకు సంబంధించి ఆ దేశ వ్యాప్తంగా 35 సంఘటనలు జరిగాయి.
తాజావార్తలు
-
Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!