Bangladesh: బంగ్లాదేశ్లో మోడీ దుర్గామాతకు బహూకరించిన కిరీటం చోరీ.. భారత్ సీరియస్
- బంగ్లాదేశ్లో మోడీ దుర్గామాతకు ప్రధాని మోడీ కిరీటం బహూకరణ
- దుర్గామాతకు బహూకరించిన కిరీటం చోరీ
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లోని జెషోరేశ్వరి ఆలయంలో దుర్గామాత కిరీటం చోరీకి గురైంది. 2021లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్గా మారింది. చోరీ ఘటనపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనను భారత్ తీవ్ర ఆందోళనతో చూస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
READ MORE: Pakistan: EAM జైశంకర్ పాకిస్తాన్ పర్యటన.. రావాల్సిండిలో 144 సెక్షన్ విధించిన పాక్ సర్కార్..
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
‘దెబ్బతిన్న దేవాలయాల నమూనా’
“ఢాకాలోని తాంతిబజార్లోని పూజా మందిరంపై దాడి, సత్ఖిరాలోని ఐకానిక్ జెషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీని తీవ్ర ఆందోళనతో గమనించాం. ఇవి ఖండించదగిన ఘటనలు. వారు దేవాలయాలు, దేవతలను అపవిత్రం చేయడం, హాని కలిగించే క్రమ పద్ధతిని అనుసరిస్తున్నారు. వీటిని మేము గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. హిందువులు, మైనారిటీల వారి ప్రార్థనా స్థలాలు, ప్రత్యేకించి ఈ పండుగ సీజన్లో భద్రత కల్పించాలని మేము బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
READ MORE: RAPO22 : మహేష్బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు
ఢాకాలోని భారత హైకమిషన్ మాట్లాడుతూ.. “ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దొంగతనంపై దర్యాప్తు చేయాలి. కిరీటాన్ని స్వాధీనం చేసుకుని అమ్మావారికి అలంకరించాలి. దోషులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.” అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆలయంలోని కిరీటం చోరీకి సంబంధించిన సీసీటీవీ వీడియోలో జీన్స్, టీ షర్ట్ ధరించిన ఓ బాలుడు ఆలయంలోకి ప్రవేశించడం కనిపించింది. కిరీటాన్ని తీసుకున్న తర్వాత, అతను దానిని తన టీ-షర్టులో దాచిపెట్టి, ఆ తర్వాత మామూలుగా గుడి నుంచి బయలుదేరాడు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!