Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ హల్చల్.. యమునా నీళ్లతో నిరసన
- కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ హల్చల్
- యమునా నీళ్లు తీసుకుని మహిళలతో నిరసన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర హల్చల్ చేసింది. పూర్వాంచల్కు చెందిన కొంతమంది మహిళలతో కలిసి యమునా నది నీళ్లు తీసుకుని కేజ్రీవాల్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది. బాటిల్స్తో తీసుకొచ్చిన మురికి నీళ్లు.. టబ్లో వేసి అనంతరం కేజ్రీవాల్ దిష్టి బొమ్మను నిమజ్జనం చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. స్వాతి మాలివాల్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇది కూడా చదవండి: Bathua Leaves Benefits: ఈ ఆకు గురించి మీకు తెలుసా..? ఎంత మేలు చేస్తుందో తెలిస్తే వదిలిపెట్టరు
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ఈ సందర్భంగా స్వాతి మాలివాల్ మాట్లాడుతూ.. యమునా నదిని కేజ్రీవాల్ కాలువగా మార్చేశారని ధ్వజమెత్తారు. యమునా నదిలో మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం నది వెంటిలేటర్పై ఉందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ మాత్రం రాజభవనంలో ఉండి.. విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారన్నారు. యమునా నీళ్లను కేజ్రీవాల్ తాగాలన్నారు.
గతేడాది మే నెలలో కేజ్రీవాల్ నివాసంలో వ్యక్తిగత కార్యదర్శి.. స్వాతి మాలివాల్పై భౌతిక దాడి చేశారు. అప్పటి నుంచి స్వాతి మాలివాల్-కేజ్రీవాల్ మధ్య వివాదం తలెత్తింది. ఇప్పటికే పలుమార్లు కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ నిరసనలు చేపట్టారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ నానా హంగామా సృష్టించారు.
ఇది కూడా చదవండి: SC Classification: ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ కీలక చర్చ..
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఈ సారి ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తోంది. అయితే మరోసారి అధికారం కోసం ఆప్.. ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
#WATCH | Delhi Police detains Rajya Sabha MP Swati Maliwal, who along with a group of women from Purvanchal, reached AAP National Convenor Arvind Kejriwal's residence with the water they collected from the Yamuna River#DelhiElections2025 pic.twitter.com/yGAA4g8u7M
— ANI (@ANI) February 3, 2025
#WATCH | #DelhiElections2025 | Before being detained by Delhi Police, Rajya Sabha MP Swati Maliwal says, "… Arvind Kejriwal has turned the Yamuna River into a drain. Black dirty rotten water is flowing in Yamuna. The river is on a ventilator, while Arvind Kejriwal is in his… pic.twitter.com/ugCEm6HfCP
— ANI (@ANI) February 3, 2025
#WATCH | #DelhiElections2025 | Rajya Sabha MP Swati Maliwal along with a group of women from Purvanchal, reach AAP National Convenor Arvind Kejriwal's residence with the water they collected from the Yamuna River earlier today. pic.twitter.com/zJM9WSKu6L
— ANI (@ANI) February 3, 2025
తాజావార్తలు
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో